మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన రేయ్ సినిమా 2015 సంవత్సరంలో విడుదలైన విషయం తెలిసిందే. నిజానికి రేయ్ సినిమా సాయి ధరమ్ తేజ్ మొట్టమొదటి గా చేసింది కాగా కొన్ని కారణాల వలన ఆ సినిమా ఆలస్యంగా విడుదల అయ్యింది. దీంతో ఆయన రెండవ సినిమా అయిన పిల్ల నువ్వు లేని జీవితం మొదటిగా విడుదల అయ్యి తన కెరీర్ లో అదే మొదటి సినిమా అయ్యింది. అయితే ఆలస్యంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన సయామీ ఖేర్ నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఆమె అందచందాలు కుర్రకారులో చెమటలు పట్టించాయంటే అతిశయోక్తి కాదు.

ఒక్క సినిమాతోనే ఆమె తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచేశారు. కానీ రేయ్ సినిమా తరువాత.. గడిచిన ఆరేళ్ళ కాలంలో ఆమె ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదు. ఎందుకంటే రేయ్ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో అందం అభినయం ఉన్నప్పటికీ దర్శక నిర్మాతలు ఆమె వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఫలితంగా అభిమానులు కూడా ఆమెను మర్చిపోయే స్థితికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కినేని నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా ద్వారా మళ్లీ సయామీ ఖేర్ ని తెలుగు ఫ్యాన్స్ ముందుకు తీసుకు రావడానికి రెడీ అయిపోయారు. దీంతో ఆమె ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే అహిషోర్ సోలోమన్ డైరెక్ట్ చేసిన యాక్షన్ థ్రిల్లర్ 'వైల్డ్ డాగ్' సినిమాను ఏప్రిల్ 2వ తేదీన భారీస్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో మొదటి హీరోయిన్ గా దియా మీర్జా నటించగా.. రెండవ హీరోయిన్ గా సయామీ ఖేర్ నటించారు. నిరంజన్ రెడ్డి - అవినాశ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన వైల్డ్ డాగ్ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని సమకూర్చారు. అతుల్ కులకర్ణి కీలకమైన పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఐతే ఆరు సంవత్సరాల తరువాత మళ్ళీ తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి వస్తున్న సయామీ ఖేర్ కి వైల్డ్ డాగ్ సినిమా కెరీర్ పరంగా ఎంతగా దోహద పడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: