2012లో వచ్చిన  బ్లాక్ బస్టర్ హిట్ సినిమా సుడిగాడు తర్వాత అల్లరి నరేష్ కామెడీ సినిమాలు ఒక్కటి కూడా ఆడలేదు . అయితే కొంచెం గ్యాప్ ఇచ్చి అల్లరి నరేష్ నటించిన మహేష్ బాబు మహర్షి సినిమా మంచి హిట్ అయింది. అలాగే సినిమాలోనరేష్ నటనకు మంచి మార్కులు పడ్డాయి . ఇక నరేష్ తన పంతాన్ని మార్చుకొని కంటెంట్ ఉన్న సినిమాలు చేయడం మొదలు పెట్టారు. అలా వచ్చిన సినిమానే నాంది .ఈ సినిమా మీద నరేష్ మంచి అంచనాలు పెట్టుకున్నాడు. అలాగే బయట కూడా నరేష్ కి మంచి హిట్ రావాలని అందరూ కోరుకున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 19న థియేటర్లో విడుదలైంది. మొదటి ఆట నుంచే ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది. అయితే సినిమా టాక్ కన్నా కలెక్షన్స్ మీద అందరి దృష్టి పడింది. రిలీజ్ అయిన మొదటి ఆటకి పెద్దగా జనాల రాకపోయినా మెల్లగా సినిమా సాయంత్రం షోస్ కి కలెక్షన్స్ అందుతుంది.ఇక అప్పుడే నరేష్ సక్సెస్ మీట్ కూడా పెట్టి చాలా భావోద్వేగం తో మాట్లాడారు. ఈ సక్సెస్ మీట్ లో నరేష్ కి ఎనిమిదేళ్లు పట్టింది హిట్ రావడానికి బాధపడ్డాడు. అయితే ఇప్పటికైనా ఆయన కి హిట్ కావడంతో ఆయన అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు. అయితే ఈ నాంది సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందన్నా సంగతి ఇప్పుడే మనకు క్లారిటీ రాదు. అయితే నాంది సినిమాని అప్పుడే అమ్మేశారు. ప్రస్తుతం బాగా ఆడుతున్న ఈ సినిమా ని ఆహా ఓటిటి మంచి రేట్ కి కొనేసింది.ఇక ఈ సినిమాని మార్చి 12 న ఆహా లో స్ట్రీమ్ చేయబోతున్నారు అని ప్రకటించారు. థియేటర్స్ లో బాగానే ఆడుతున్న సినిమాని ఇలా ఓటిటి సినిమాలో విడుదల చేయడం అనేది చాలా మందికి మింగుడు పడట్లేదు. అయితే ఈ సినిమా అల్లరి నరేష్ కి అన్ని విధాలుగా మంచి విజయాన్ని ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: