బాహుబలి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాస్త పాన్ ఇండియా స్టర్ అయిపోయాడు..ఆ సినిమాతో మన డార్లింగ్ కి  బాలీవుడ్‌లో కూడా ఊహించని విధంగా క్రేజ్ నెలకొంది. ఇక 'సాహో' సినిమాతో బాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోలని మించిన క్రేజ్ సాధించాడు. ఈ సినిమాతో యంగ్ డైరెక్టర్ సుజీత్ ప్రభాస్‌ని హాలీవుడ్ హీరోలా చూపించి ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ నుంచి పలువురు సినీ ప్రముఖుల నుంచి అలాగే విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఈ క్రమంలో ప్రభాస్‌తో మేకర్స్ పాన్ ఇండియన్ సినిమాలు తప్ప మామూలు కమర్షియల్ సినిమాలు నిర్మించడం లేదు.ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు భారీ బడ్జెట్‌ పాన్ ఇండియన్ సినిమాలున్నాయి. ఇప్పటికే యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న 'రాధే శ్యామ్' సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది.

 అలాగే 'కేజీయఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న 'సలార్‌'తో పాటు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్‌లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్నాయి. అలాగే వైజయంతీ మూవీస్ 50వ సినిమాని ప్రభాస్‌తో నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. అయితే టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోలు పాన్ ఇండియన్ స్టార్‌గా పాపులారిటీని సంపాదించుకొని ఏకంగా ప్రభాస్‌నే డామినేట్ చేయడానికి అన్నీ రకాలుగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్'తో చరణ్, ఎన్.టి.ఆర్ ముందు పాన్ ఇండియన్ స్టార్స్‌గా క్రేజ్ దక్కించుకోవాలని ప్లాన్ చేస్తున్నప్పటికి అల్లు అర్జున్ వారికంటే ముందే 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ అనిపించుకోవాలని తాపత్రయపడుతున్నాడు.

 సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తెలుగు తో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఇక చరణ్, శంకర్ కాంబినేషన్ లో వచ్చేది కూడా పాన్ ఇండియన్ సినిమానే. అలాగే ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చేది కూడా పాన్ ఇండియన్ సినిమా అంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా పాన్ ఇండియన్ సినిమాగా తయారవుతోంది. మహేష్ బాబు సర్కారు వారి పాట విషయంలో క్లారిటీ లేనప్పటికి ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రాబోయే సినిమా మాత్రం పాన్ ఇండియన్ సినిమానే. మంచు విష్ణు 'మోసగాళ్ళు' అన్న పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు. మరి ఈ అందరిలో ప్రభాస్ ను బీట్ చేసే ఆ స్టార్ హీరో ఎవరా అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: