అలాగే 'కేజీయఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న 'సలార్'తో పాటు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్నాయి. అలాగే వైజయంతీ మూవీస్ 50వ సినిమాని ప్రభాస్తో నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. అయితే టాలీవుడ్లో దాదాపు అందరు స్టార్ హీరోలు పాన్ ఇండియన్ స్టార్గా పాపులారిటీని సంపాదించుకొని ఏకంగా ప్రభాస్నే డామినేట్ చేయడానికి అన్నీ రకాలుగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్'తో చరణ్, ఎన్.టి.ఆర్ ముందు పాన్ ఇండియన్ స్టార్స్గా క్రేజ్ దక్కించుకోవాలని ప్లాన్ చేస్తున్నప్పటికి అల్లు అర్జున్ వారికంటే ముందే 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ అనిపించుకోవాలని తాపత్రయపడుతున్నాడు.
సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తెలుగు తో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఇక చరణ్, శంకర్ కాంబినేషన్ లో వచ్చేది కూడా పాన్ ఇండియన్ సినిమానే. అలాగే ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చేది కూడా పాన్ ఇండియన్ సినిమా అంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్లో వస్తున్న సినిమా పాన్ ఇండియన్ సినిమాగా తయారవుతోంది. మహేష్ బాబు సర్కారు వారి పాట విషయంలో క్లారిటీ లేనప్పటికి ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రాబోయే సినిమా మాత్రం పాన్ ఇండియన్ సినిమానే. మంచు విష్ణు 'మోసగాళ్ళు' అన్న పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు. మరి ఈ అందరిలో ప్రభాస్ ను బీట్ చేసే ఆ స్టార్ హీరో ఎవరా అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..!!