ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో ఫోన్ వాడకం సర్వసాధారణం అయ్యింది. మొబైల్ ఫోన్ లేకపోతే మనుషులు ఒక్క రోజు కూడా జీవించలేక పోతున్నారు అనేది అక్షర సత్యం. ఇక హీరోహీరోయిన్ల విషయానికొస్తే వారి చేతుల్లో లక్షల విలువైన యాపిల్ ఫోన్లు ఎప్పుడూ కనిపిస్తుంటాయి. ఫోన్ లోనే తమ పనులన్నీ జరిగిపోతుంటాయి. తమ ఫోనుల నుంచే అభిమానులకు ఎప్పటికప్పుడు అప్ డేట్స్ కూడా ఇస్తుంటారు. కానీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో మీరు ఎప్పుడైనా ఫోన్ చూసారా అని అడిగితే సమాధానం లేదు అనే వినిపిస్తుంది. ఇప్పటివరకూ ప్రభాస్ చేతిలో ఫోన్ చూసిన వారు ఎవరూ లేరు అంటే అతిశయోక్తి కాదు. అసలు ప్రభాస్ ఫోన్ వాడతారా? అని అడిగితే ఒక స్టార్ డైరెక్టర్ కూడా అనూహ్యమైన సమాధానం చెప్పి ఆశ్చర్యపరిచారు.


మహానటి సినిమా తెరకెక్కించి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన నాగ్ అశ్విన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ప్రభాస్ గురించి మాట్లాడారు. అయితే ప్రభాస్ దగ్గర ఫోన్ ఉన్నట్టు తనకు ఎప్పుడూ కనిపించలేదని నాగ్ అశ్విన్ బాంబు పేల్చారు. కనీసం తామిద్దరూ మాట్లాడుతున్న సమయంలో కూడా ఫోన్ రింగ్ అయినట్టు తనకు ఎప్పుడూ వినిపించ లేదని నాగ్ అశ్విన్ చెప్పారు. ప్రభాస్ చాలా తక్కువగా ఫోన్ వినియోగిస్తారని.. తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని చాలా ఆప్యాయంగా పలకరిస్తూ వారికి ఎంతో గౌరవ మర్యాదలు ఇచ్చి హ్యాపీ గా ఉంచడానికి ప్రయత్నం చేస్తారని సన్నిహితులు చెబుతుంటారు.


ప్రభాస్ చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారట. అందరి లాగా ఫోన్లను వినియోగిస్తూ ఎదుటి వారిని నిర్లక్ష్యం చేసే అలవాటు ప్రభాస్ కి లేనే లేదట. సోషల్ మీడియాలో కూడా ప్రభాస్ అంతగా యాక్టివ్ గా ఉండరు అని అందరికీ తెలిసిన విషయమే. సోషల్ మీడియా ఖాతాల్లో తనకి ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారనే విషయం కూడా ప్రభాస్ కి తెలియదట. ఏదిఏమైనా ఈ డిజిటల్ యుగంలో ఎలక్ట్రానిక్ పరికరాలకు బానిస కాకుండా ప్రభాస్ తన జీవితాన్ని కొనసాగిస్తూ అందరికీ స్ఫూర్తిదాయకం అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: