ఈ రోజుల్లో సోషల్ మీడియాతో, సైబర్ నేరగాళ్లతో చాల జాగ్రతగా ఉండాలి. లేదంటే మీ జీవితాన్ని ఉన్నచోటనే నిమిషం లో నాశనం చేయగలవు. మహామహులకే సోషల్ మీడియా లో వార్తలు రావడం తప్పలేదు. ఈ బిగ్ బాస్ బ్యూటీ ఎంత. ఉందుకే సోషల్ మీడియాలో ఉన్నపుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఉన్నపళంగా ఒక మాట అనకూడదు. సోషల్ మీడియా లో కాచుకొని కూర్చున్న కొందరు ఏవో రాతలు రాసి వాళ్ళు ఏమి అనకుండా వాళ్ళు అవి అన్నట్లు  మార్చి విధ్యంసం సృష్టించగలరు. అప్పుడు మీరు కన్నీళ్లు పెట్టడం తప్ప ఇంకా ఏమి చేయలేరు.

ఆసలు విషయంలోకి వెళ్తే, బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. అయితే పవన్ కళ్యాణ్ విషయం లో ఆమె ఒక మాట చెప్పినదానికి సోషల్ మీడియా పై ఫైర్ అవుతుంది. ఆమె అంతలా ఫైర్ అవడం వెనుక ఆమె చెప్పిన విషయం ఏమిటి?  అషు రెడ్డి సోషల్ మీడియా లో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండేది ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన ఆష్ రెడ్డి తన అభిమానులతో మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ కి నాలుగో భార్యగా అవకాశం వస్తే ఉంటారా! అనే ప్రశ్న వేయగా దానికి అషు రెడ్డి  ఆలోచించకుండా ఒకే అని చెప్పింది. ఇక కొందరు ఈ వార్తని వాడుకుంటే వైరల్ అవొచ్చని భావించి పవన్ కళ్యాణ్ నాలుగో భార్య అషు రెడ్డి అంటూ తెగ ట్రోల్ల్స్ చేయడం మొదలెట్టారు. ఈ వార్త  సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.

ఈ వార్తని చూసిన అషు రెడ్డి షాక్ కి గురైయ్యింది. దీంతో తనపై వస్తున్న ట్రోల్ల్స్ పై సీరియస్ గా రియాక్ట్ అయ్యింది.
 నేను ఆయనకి వీరాభిమానినని దానిని మీరు వేరేలా అనుకోని 'పిచ్చి పిచ్చి రాతలు రాయవద్దని' ఇది మంచి పద్ధతి కాదని అషు రెడ్డి సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. 'మీ రాతల వాళ్ళ అది నా జీవితాన్ని ఎక్కువ  ప్రభావితం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది'.

మరింత సమాచారం తెలుసుకోండి: