ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..  సహజీవనం అనే మాటలు సాధారణ కుటుంబాలకు అయితే సరిపడవు కానీ.. సెలబ్రిటీ కుటుంబాలకు చెందిన వారు ఎక్కువగా ఎన్నుకునే మార్గమైతే ఇదే అని చెప్పొచ్చు.. అయితే సాధారణ కుటుంబాలలో కంటే.. ఇలా విడిపోయిన తర్వాత సెలబ్రిటీలపైనే పంచ్‌లు, సెటైర్లు ఎక్కువగా పడుతుంటాయి. అయినా సరే అవేం పట్టించుకోకుండా.. యధేచ్చగా బయట తిరిగేస్తుంటారు సెలబ్రిటీ కుటుంబాల్లో విడిపోయిన వారు. అలాంటి కోవకే చెందుతుంది హీరోయిన్ అమలాపాల్.భర్త ఏ.ఎల్. విజయ్‌తో విడాకులు తీసుకున్న తర్వాత.. వేరే ఎవరితోనో సహజీవనం చేస్తున్నట్లుగా ఆమెపై వార్తలు వచ్చాయి.

ఆ వార్తలను ఆమె ఖండించనూ లేదు. మాజీ భర్త విజయ్ మాత్రం మరో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటున్నాడు. అమలాపాల్ పై కూడా రెండో పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి.. కానీ ఈ లైఫ్ ఉన్నది ఎంజాయ్ చేయడం కోసమేనని, ఇప్పుడప్పుడే మళ్లీ పెళ్లి చేసుకుని మరో తప్పు చేయనని ఆ మధ్య కాస్త గట్టిగానే చెప్పుకొచ్చింది. అయితే తనకు విడాకులైనా కూడా తగిన గౌరవం ఇస్తున్నందుకు ఈ భామ ఉబ్బితబ్బిబ్బవుతోంది.ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ ఆధ్వర్యంలో తాజాగా నిర్వహించిన 'వాట్స్ నెక్ట్స్ ఇండియా 2021' ప్యానల్ డిస్కషన్ కార్యక్రమంలో అతిథిగా ఆమెను అవకాశం వరించింది.

 ఈ ప్యానల్‌లో కరణ్ జోహార్, ప్రియాంకా చోప్రా, విక్రమాదిత్య మోత్వానీ, వివేక్ గొంబర్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. అలాంటి హేమాహేమీలు పాల్గొన్న ఈ డిస్కషన్ కార్యక్రమంలో దక్షిణాది సినీ పరిశ్రమ గురించే మాట్లాడే అవకాశం వచ్చినందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని అమలాపాల్ చెప్పుకొచ్చింది. విడాకుల తర్వాత ఇలాంటి కార్యక్రమాలలో ఇంతవరకు పాల్గొని అమలాపాల్‌కు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపింది...ఇక ప్రస్తుతం మళ్ళీ సినిమాలపై ఫోకస్ పెడుతోంది అమలాపాల్.. సినిమాలతో పాటు పలు వెబ్ సీరీస్ లలో కూడా నటిస్తోంది ఈ తమిళ హీరోయిన్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: