తెలుగులో టాప్
హీరో గా ఒక రేంజ్ క్రేజ్ ఉన్న
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సినిమాలతోనే కాదు ,
టీవీ యాడ్స్ తో కూడా చాలా బిజీగా ఉన్నారు. 2020లో వచ్చిన సరిలేరు నికెవ్వరు
బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మంచి
జోష్ మీద తన కొత్త
సినిమా సర్కారు వారి పాట లో నటిస్తున్నారు. ఈ సినిమాని
గీత గోవిందం లాంటి సూపర్ హిట్ తీసిన పరుశురాం దర్శకత్వం వహిస్తున్నారు. ఇక
కీర్తి సురేష్ ఈ సినిమాలో
మహేష్ బాబుకి జోడిగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్
పోస్టర్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకి
ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాను వచ్చే యేడాది
సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రాన్ని మైత్రీ
మూవీ మేకర్స్,
మహేష్ బాబు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. రీసెంట్గా ఈ
సినిమా షూటింగ్ దుబాయ్లో ప్రారంభమైంది. ఫస్ట్ షెడ్యూల్లో
మహేష్ బాబు,
కీర్తి సురేష్ లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
దుబాయ్ షెడ్యూల్ ముగిసిన తర్వాత హైదరాబాద్లో మిగతా
మూవీ చిత్రీకరణ జరగనున్నట్టు సమాచారం. అయితే ఫిబ్రవరి 21న సెకండ్ షెడ్యూల్ కూడా ముగుస్తుంది. అయితే ఈ
సినిమా నుంచి
మహేష్ బర్త్డేకు స్పెషల్ సర్ప్రైజ్ రానుందని వార్తలు నడుస్తున్నాయి.
మహేష్ పుట్టినరోజు ఆగస్ట్ 9న కాబట్టి అప్పటికి ఈ
సినిమా టీజర్ రిలీజ్ చేస్తారని అంటున్నారు.
మూవీ మేకర్స్ కూడా అందుకే ప్రయత్నిస్తున్నారంట. మరి ఈ వార్త ఎంత వరకు నిజమనేది తెలియాలి. అయితే ఈ సంవత్సరం
మహేష్ బాబు ఒక్క
సినిమా కూడా విడుదల కాలేదు కాబట్టి ఈ
సినిమా నుంచి ఒక టీజర్ విడుదల చేస్తే అభిమానులు ఆనందిస్తారని
మూవీ టీం భావిస్తుంది.ఇక
2020 సంక్రాంతి లాగానే 2022 సంక్రాంతికి
మహేష్ బాబు మళ్ళీ సూపర్ హిట్ కొడతాడేమో చూడాలి.