మన
టాలీవుడ్ లో మంచి టాలెంట్ ఉన్న యంగ్ డైరెక్టర్స్ లో
నాగ అశ్విన్ ఒకరు. రెగులర్ డైరెక్టర్స్ అంత ప్రేమకథలని ఎంచుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటే
నాగ అశ్విన్ మాత్రం ఎవడే సుబ్రమణ్యం లాంటి కొత్త కథతో మన ముందుకు వచ్చారు. ఆ
సినిమా చూసినప్పుడు చాలామంది అనుకోని ఉంటారు
నాగ అశ్విన్ పెద్ద
డైరెక్టర్ అవుతాడు అందరూ అనుకున్నట్టే ఆయన
మహానటి సినిమాతో దేశమంతా సంచలనం సృష్టించాడు.
సావిత్రి గారి బయోపిక్ ని ఎంతో అందంగా చిత్రీకరించారు
నాగ అశ్విన్. ఇక
మహానటి లాంటి భారీ
బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన ఇంకొక క్రేజీ సినిమాని మొదలుపెట్టబోతున్నాడు. అదే
ప్రభాస్ తో ఒక సైన్స్ ఫిక్షన్ కథ చేయబోతున్నారు. ఈ
సినిమా ఇంకా షూటింగ్ కూడా మొదలు కాకముందే ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. అయితే ఈ కోవిడ్ సమయంలో
నాగ అశ్విన్ నెటీఫ్లిక్స్ ఓటీటీ కోసం పిట్టా కథలు అనే ఒక అంతలజీ లో ఒక కథ ని డైరెక్ట్ చేసాడు. అలాగే జాతిరత్నాలు సినిమాని కూడా నిర్మించి
నాగ అశ్విన్ బిజీగా ఉన్నారు ఈ
సినిమా ప్రమోషన్స్ లో
నాగ అశ్విన్ ప్రభాస్ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. అదేంటి అంటే ఈ
ప్రభాస్ అసలు
ఫోన్ ఉపయోగించడట. ఆయన్ని ఇన్ని సార్లు కలిసినప్పుడు ఎప్పుడు ఆయన దగ్గర
ఫోన్ చూడలేదు అని
నాగ అశ్విన్ చెప్పారు. అలాగే సోషల్ మీడియాకి
ప్రభాస్ చాలా దూరంగా ఉంటాడని ఆయన అన్నారు. ఇక
నాగ అశ్విన్ సినిమా మీద
ప్రభాస్ ఫాన్స్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు
సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అని. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఆడిషన్స్ జరుగుతున్నాయి. సలార్ , అధిపురుష్ సినిమాల తర్వాత ఈ
సినిమా పట్టాలు ఎక్కబోతుంది.