మోహ‌న్ బాబు రెండో కుమారుడు మంచు మ‌నోజ్ 2004లో దొంగ దొంగ‌ది అనే సినిమాతో వెండి తెర‌కు హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో మొద‌టి సినిమాతో క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఈ సినిమా త‌ర‌వాత మ‌నోజ్ ఎన్నో సినిమాలు చేసాడు. వాటిలో రాజుబాయ్‌, వేదం, మిస్ట‌ర్ నూక‌య్య‌, ప్ర‌యాణం సినిమాల‌తో త‌నకంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతే కాకుండా మ‌నోజ్ త‌న సినిమాల్లో డూప్ లేకుండా న‌టించి త‌న కూంటూ ఒక ప్ర‌త్యేక‌ను చాటుకున్నాడు. సినిమాల ప‌రంగా మ‌నోజ్ కేరీర్ భాగానే ఉన్నా వైవాహిక జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదురుకున్నాడు. మ‌నోజ్ 2016 లో ప్ర‌ణ‌తి రెడ్డిని ప్రేమించి పెద్ద‌ల స‌మ‌క్ష‌మంలో వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లైన మూడేళ్ల‌కే ఇద్ద‌రి మ‌ధ్య వివాదాలు త‌లెత్త‌డంతో 2019లో వారు వాడాకులు తీసుకున్నారు. ఆ త‌ర‌వాత మ‌నోజ్ డిప్రెష‌న్ లోకి వెళ్లిపోయాడ‌ని అందువ‌ల్లే సినిమాల‌కు దూరంగా ఉంటున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి.

ఈ నేప‌థ్యంలో మ‌నోజ్ మ‌ళ్లీ త‌న కొత్త సినిమాను మొద‌లు పెడుతూ ఇప్ప‌టి నుండి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నా అంటూ పేర్కొన్నాడు. ఇదిలా ఉండ‌గా మ‌నోజ్ మ‌ళ్ళీ పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్నాడు అంటూ కొద్ది రోజుల నుండి వార్త‌లు వ‌స్తున్నాయి. అంతే కాకుండా మోహ‌న్ బాబు ఈసారి త‌న ద‌గ్గ‌రి బంధువుల  అమ్మాయితో సంబంధం కుదిర్చార‌ని త్వ‌ర‌లో నే పెళ్లి కూడా జ‌ర‌గ‌బోతుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. కాగా ఆ వార్త‌ల పై తాజాగా మ‌నోజ్ క్లారిటీ ఇచ్చారు. ఓ న్యూస్ వెబ్ సైట్ మ‌నోజ్ పెళ్లిపై వార్త‌ను ప్ర‌చురించ‌గా ఆ వార్త‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన మ‌నోజ్ పెళ్ళి తేదీని కూడా మీరే చెప్పండి అంటూ కౌంట‌ర్ వేశారు. అంతే కాకుండా జాతి ర‌త్నాలు ట్రైల‌ర్ నుండి బ్ర‌హ్మానందం కోర్టు సీన్ స‌న్నివేశాలను మీమ్స్ రూపంలో అప్లోడ్ చేసి..త‌న పెళ్లి వార్త‌ల‌ను ఖండించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: