ప్రపంచవ్యాప్తంగాకరోనా  కారణంగా  లాక్ డౌన్ విధించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ వల్ల చాలామంది అనేక విధాలుగా ఇబ్బంది పడ్డారు. ఇది సామాన్య భక్తులు సినీ ఇండస్ట్రీ వారు చాలా ఇబ్బందులు పడ్డారు. లాక్ డౌన్ కారణంగా సినీ ఇండస్ట్రీలో షూటింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి. సినీ ప్రముఖులంతా ఇంటికే పరిమితం అయిపోయారు. ఇంట్లోనే ఉంటూ ఇంటి పనులు చేస్తూ చాలెంజ్  పెట్టారు. బి ది రియల్ మ్యాన్ చాలెంజ్ టాలీవుడ్ లో దుమ్ము రేపింది. పలువురు ప్రముఖులు ఈ ఛాలెంజ్ ను విజయవంతంగా పూర్తి చేశారు. అందులోనే భాగంగా తారక్ ఇంటి పనులు చేస్తూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. రామ్ చరణ్ కూడా చెట్లకు నీరు పోయడం బట్టలన్నీ వాషింగ్ మిషన్ లో వేయడమే కాకుండా తన సతీమణి ఉపాసన కు చక్కగా ఓ కాఫీ కలిపి ఇచ్చాడు. ఇలా సినీ ఇండస్ట్రీ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఇంట్లో పనులు చేస్తూ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.


ఈ సందర్భంగా తారక్ కొరటాల శివను నామినేట్ చేయగా.డైరెక్టర్ శివ గారు తను స్వీకరించిన ఛాలెంజ్ కు స్పందనగా పేస్ బుక్ ద్వారా వీడియో పోస్ట్ చేసారు.తదు పరి ‘విజయ్ దేవర కొండ’ ని నామినేట్ చేసారు ’శివ సారు మా మమ్మీ నన్ను పని చేయనివ్వట్లేదు. పని డబుల్ అవుతుందట. ఇంట్లో ఇంకా మమ్మల్ని రియల్ మేన్ గా చూడట్లేదు. పిల్లల్లాగానే  ట్రీట్ చేస్తున్నారు. కానీ లాక్‌డౌన్‌లో నేను చేసే పనిని అందరికి చూపిస్తాను’ అని విజయ్‌ పేర్కొన్నారు. ఇక, సినిమాల విషయానికి వస్తే విజయ్‌ ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్‌కు జంటగా అనన్యా పాండే నటిస్తున్నారు.



 బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఛార్మి, పూరి, కరణ్‌ జొహర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.కానీ నేను లాక్ డౌన్ లో నేను పని చేసి అందరికి చూపిస్తాను అని చెప్పుకొచ్చారు ఇక పోతే తన సినిమాల గురించి చెప్పుకోవలసినది ఏంటి అంటే విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘పూరి జగన్నాథ్‌’ సినిమాలో నటిస్తున్నారు.విజయ్ కి జోడిగా అనన్య పాండే నటించబోతున్నారు.సినిమా కాన్సెప్ట్ విషయానికి వస్తే బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో కొనసాగుతుంది. ఈ సినిమా ని ఛార్మి,పూరి ,కారం జోహార్ లు కలిసి నిర్మిస్తున్నారు ‘వరల్డ్ ఫెమస్ లవర్’ సినిమా తో డీలా పడ్డ రౌడీ ఫాన్స్ ని ఎలా అలరిస్తారో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: