ఇమేజ్ విషయాన్ని పక్కన పెట్టి భారీ చిత్రాలకు మాత్రమే ఒప్పుకోకుండా....  క‌థ న‌చ్చితే చాలు.. సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే హీరో నంద‌మూరి వారసుడు కల్యాణ్ రామ్‌. నంద‌మూరి న‌ట వార‌స‌త్వంతో వెలిగిపోయే రామ్  1989లో "బాల గోపాలుడు" చిత్రంతో బాల‌ న‌టుడిగా మొట్టమొదటి సారిగా వెండి తెరపై కనిపించారు. ఆ తర్వాత "తొలి చూపులోనే" సినిమాతో హీరోగా బరిలోకి దిగారు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ కాజల్ కు కూడా ఈ సినిమాతో గొప్ప గుర్తింపు లభించింది. పటాస్ సినిమా ఇచ్చిన హిట్ తో మంచి జోష్ తో ముందుకు సాగిపోతున్నారు కళ్యాణ్ రామ్.

ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా మారాడు ఈ యంగ్ హీరో. ఎన్టీఆర్ నటించబోతున్న 30 వ చిత్ర నిర్మాతల్లో కళ్యాణ్ రామ్ కూడా ఒకరు. అయితే ఈ మధ్య కాలంలో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన  సినిమాలేవి రాక పోవడం అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తోంది. అందులోనూ ఈ హీరో నటిస్తున్న తాజా సినిమాల గురించి ఎటువంటి అప్డేట్స్ కూడా రాలేదు. దాంతో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం నటిస్తున్న తాజా సినిమాల అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి  ఆసక్తి చూపుతున్నారు అభిమానులు.

లాక్ డౌన్ కు ముందే పలు సినిమాలతో బిజీ అయిన కళ్యాణ్ రామ్... ఇప్పటికి ఒక సినిమాను కూడా రిలీజ్ చేయకపోవడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే ఈసారి ఈ పవర్ ఫుల్ పటాస్ హీరో సైలెంట్ గా సడన్ సర్ప్రైజ్ ఇచ్చేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఎలాంటి హడావుడి లేకుండా బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట ఈ హీరో. మరి ఈ ప్లానింగ్ ఎంత వర్కౌట్ అవుతుందో చూడాలి. మరి త్వరలోనే ఈ సినిమాలకు సంబంధించిన వివరాలు అభిమానులకు తెలియచేస్తారేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: