టాలీవుడ్ లో ఉన్న హీరోలలో కొత్త రకం కథలను ప్రోత్సహించడంలోను, కొత్తరకం సినిమాలలో నటించడంలోను కింగ్ అక్కినేని నాగర్జున ఎప్పుడు ముందే ఉంటారు. ఆయన కెరియర్ మొదటి నుండి కూడా కొత్త దర్శకులను సినీ పరిశ్రమకు పరిచయం చేస్తూ, ప్రేక్షకులకు కొత్తరకం వినోదాన్ని పంచుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న కొత్త చిత్రం ‘వైల్డ్ డాగ్’. ఈ సినిమాను పర్ఫెక్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో కొత్త దర్శకుడు అహిషోర్ సోలోమన్ టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

ఇక ఈ సినిమాలో నాగ్ ఎన్.ఐ.ఎ అధికారిగా కనిపించనున్నారు. చేస్తున్నారు అయితే ఎప్పుడో మొదలైన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అంతే కాకుండా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడం లోను చిత్ర యూనిట్ బాగా వెనుకబడింది. అయితే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు రావడంతో మెల్ల మెల్లగా అప్డేట్స్ ఇవ్వడంలో వేగం పెంచింది చిత్రయూనిట్. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ప్రకటించిన యూనిట్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను కూడా విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంది.

సినిమా ట్రైలర్ ను మార్చి 12 న సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఇందులో బాలీవుడ్ బ్యూటీలు సయామీ ఖేర్, దియా మీర్జాలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టెయిన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదల అయిన నాగ్ లుక్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కూడా నాగ్ కెరియర్ లో మరో డిఫరెంట్ మూవీ అవుతుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తుంది. మరి ఈ సినిమా తో కింగ్ నాగార్జున ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. ఈ సినిమాను ఏప్రిల్ 2వ తేదీన విడుదలచేస్తున్నట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: