అయితే ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుండి పవన్ లుక్స్ లీకైనా సంగతి తెలిసిందే. లీకైనా ఫోటోలో పవన్ గెటప్ కు ఫ్యాన్స్ నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా మరో వారం రోజులు పాటు ఇంటర్వెల్ లో వచ్చే భారీ యాక్షన్ సీన్స్ ను షూట్ చేయనున్నట్లు సమాచారం. కాగా మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి అప్పటి పరిస్థితులను తలపించేలా భారీ సెట్స్ వేసి షూట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
అలాగే మరో హీరోయిన్ గా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. కాగా ఈ సినిమాని పాన్ ఇండియన్ సినిమాగా తీసుకురానున్నారు. ఈ సినిమాతో పవన్ మొదటిసారిగా పాన్ ఇండియా మార్కెట్ పై దృష్టి పెట్టాడు. అందుకే క్రిష్ ఈ సినిమాకి మరింత గ్రాండ్ నెస్ ను తీసుకు వచ్చేందుకు ఇతర భాషలలోని నటులను కూడా తీసుకున్నారు. ఇక ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ పిరియాడికల్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోనే నిలవనుంది. మరి పవన్ ఈ సినిమాతో ఎలాంటి సంచలనలు నమోదు చేస్తాడో చూడాలి.