టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఇటీవల సాహో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటించిన ఆ సినిమాకి సుజీత్ దర్శకత్వం వహించగా టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థల్లో ఒకటైన యువి క్రియేషన్స్ వారు దానిని ఎంతో భారీ ఖర్చుతో నిర్మించారు. దాని తరువాత ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు.
వాటిలో ఒకటి రాధేశ్యామ్, మరొకటి సలార్ అలానే ఇంకొకటి ఆదిపురుష్. అయితే వీటిలో రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అలానే ప్రశాంత్ నీల్ తీస్తున్న సలార్, ఓం రౌత్ తీస్తున్న ఆదిపురుష్ సినిమాలు రెండూ ఇటీవల రెగ్యులర్ షూటింగ్ ని మొదలెట్టాయి. రాధేశ్యామ్ మూవీ ఈ ఏడాది జులై 30 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. రిట్రో లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ఒక డిఫరెంట్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. అయితే అసలు మ్యాటర్ ఏమిటంటే, తొలిసారిగా బిల్లా సినిమాలో ప్రభాస్ తో కలిసి నటించింది అనుష్క, ఆ తరువాత మరొక్కసారి ప్రభాస్ తో ఆమె జతకట్టిన సినిమాలు మిర్చి, అలానే బాహుబలి సిరీస్ మూవీస్.

అయితే ఆ సినిమాల సమయంలో ప్రభాస్, అనుష్క ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడిందని, అలానే వారు త్వరలో పెళ్లి కూడా చేసుకోనున్నారు అంటూ ఇటీవల విపరీతంగా వార్తలు ప్రచారం అయ్యాయి. కాగా తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమే, తమ మధ్య అటువంటి ఉద్దేశ్యం ఏమి లేదు అంటూ ప్రభాస్, అనుష్క ఒక ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పారు. అయినప్పటికీ కూడా అవి ఇంకా ఆగడం లేదు. కొన్నాళ్లుగా ఈ వార్తలు మరింతగా ఊపందుకోవడంతో పక్కాగా ప్రభాస్ ని అనుష్క వివాహమాడడం ఖాయం అని మరికొందరు న్యూస్ వైరల్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ కథనాలకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట పడాలి అంటే స్వయంగా ప్రభాస్ రంగంలోకి దిగి ఒక వివరణ ఇవ్వాల్సిందేనేమో అని అంటున్నారు పలువురు .....!!

మరింత సమాచారం తెలుసుకోండి: