చిరంజీవి హీరోగా కొరటాల శివ తీస్తున్న లేటెస్ట్ సినిమా ఆచార్య. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు కలిసి ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి కి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా తొలిసారిగా చిరంజీవి తో కలిసి ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. చిరంజీవి ఇందులో ఒక మాజీ నక్సలైట్ పాత్ర చేస్తుండగా ఆయన అనుచరుడైన కామ్రేడ్ సిద్ద పాత్రలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నట్లు సమాచారం. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఖమ్మం పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.

ఇక ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ కి మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ నుండి కూడా సూపర్ రెస్పాన్స్ లభించింది. మెగాస్టార్, మెగాపవర్ స్టార్ తొలి సరిగా కలిసి నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై అందరిలోనూ మరింతగా అంచనాలు ఉన్నాయి. మంచి మెసేజ్ తో కూడిన పక్కా కమర్షియల్ ఎంటెర్టైనర్ గా దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని, తప్పకుండా రిలీజ్ తరువాత ఈ మూవీ భారీ సక్సెస్ అందుకోవడం ఖాయం అని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

అసలు మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీ కి సంబంధించి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఒక వార్త ప్రకారం ఇందులో మాయలు మంత్రాలు ఉంటాయని, అదేనండి ఇది సోసియో ఫాంటసి జానర్ లో తెరకెక్కుతున్న సినిమా అని అంటున్నారు. అయితే పక్కాగా సినిమా యొక్క కథ, కథనాల విషయమై ఏ మాత్రం న్యూస్ బయటకు పొక్కకుండా యూనిట్ పక్కాగా జాగ్రత్తలు తీసుకున్నట్లు టాక్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంవిహారకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే ఆచార్య రిలీజ్ వరకు వెయిట్ చేయక తప్పదు అని అంటున్నారు విశ్లేషకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: