కొన్ని గంటల క్రితం, ఆచార్య సెట్ నుంచి చిరంజీవి మరియు రామ్ చరణ్ యొక్క ఆన్-లొకేషన్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయింది. ఆ పిక్ ఇప్పుడు ఫేస్ బుక్, ట్విట్టర్ సహా అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో విస్తృతంగా షేర్ చేయబడుతోంది. చిరంజీవి - చరణ్ లకు సంబంధించి ఒక కీలక సన్నివేశాన్ని నిన్న ఇల్లెందు ఓపెన్ కాస్ట్ మైన్స్, షూటింగ్ జరిపారు. ఈ నేపధ్యంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆలివ్ గ్రీన్ దుస్తులలో ఉన్న వీరిద్దరినీ క్లిక్ మనిపించాడు. ఏమయిందో ఏమో కానీ ఆ ఫోటో సోషల్ మీడియాలో కాసేపటిలోనే వైరల్ అయింది.

అయితే ఇది కావాలని యూనిట్ వదిలిన పిక్ కాదని చిరు మరియు చరణ్ యొక్క ఈ పిక్ ను ఎవరో కావాలనే లీక్ చేశారని గుర్తించారు. ఈ సినిమా మీద జనాల్లో ఆసక్తి నెలకొని ఉండడంతో అది ట్రేండింగ్ లోకి కూడా వచ్చేసింది. ఈ దెబ్బకు దర్శకుడు కొరటాల శివ షాక్ అయినట్టు చెబుతున్నారు. వెంటనే ఆయన లోకల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు కూడా చేసినట్టు చెబుతున్నారు. సెట్ లో ఉన్న పోలీసు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ సంఘటన జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నట్టు చెబుతున్నారు.

దీంతో పోలీసు శాఖ త్వరగా స్పందించి, ఈ సంఘటన మళ్లీ పునరావృతం కాదని నిర్మాతలకు హామీ ఇచ్చింది. దీంతో పోలీసు వారు ఆచార్య షూటింగ్ లొకేషన్‌లో భద్రతను కఠినతరం చేశారు. ఇక చిరంజీవి హీరోగా నటిస్తున్నా ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మే 13 న విడుదల కానుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇక ఈ సినిమాని మాటినీ ఎంటర్టైన్మెంట్స్ మరియు కొణిదెల ప్రొడక్షన్స్ దీనిని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: