మార్చి 8 అంతర్జాతీయ  మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, "మార్పు నీతోనే మొదలవ్వాలని" మహిళలందరూ పిలుపునిస్తోంది అక్కినేని వారి కోడలు సమంత.ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమంతా మహిళలను ఉద్దేశించి, ప్రత్యేకంగా సోషల్ మీడియా వేదికగా ఒక సందేశాన్ని షేర్ చేసింది..తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా మహిళల కోసం ఆమె మాట్లాడుతూ.. " మన స్థాయి ఏంటో..? విలువ ఏంటో..? తెలుసుకొనే సందర్భం వచ్చింది. మన అర్హతకు తక్కువగా ఉండాల్సిన అవసరం లేదు.. మనమేంటో..? మన స్థాయి ఏంటో..? నిరూపించుకోవాలి. ఏ ఒక్క మహిళ తనను తాను కించ పరుచుకోకుండా ఉండాలి.. నేను కూడా నన్ను నేను మరింత నమ్మాలని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా చాలెంజ్ చేసుకుంటున్నాను.. మిమ్మల్ని కూడా చాలెంజ్ చేయమని అడుగుతున్నాను.. నీ నుంచే సాధికారత రావాలి . ఆ మార్పు నీతోనే మొదలవ్వాలి.. అని సమంత పేర్కొన్నది.


సమంత "ఏమాయ చేసావే"  సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తన నటన, అందం, చక్కనైన హావభావాలను ప్రదర్శిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది.. ఈ సినిమా ఆమెకు ఊహించిన స్థాయి కంటే ఎక్కువ ఫలితాలను అందించింది. ఆ తరువాత ఎన్నో సినిమాలలో అవకాశాలు, అలాగే అప్పటి నుండి ఇప్పటి వరకు  ఆమెను ఒక స్టార్ హీరోయిన్ గా నిలబెడుతున్నాయి.. ప్రస్తుతం ఈమె తీసే ప్రతి సినిమా కూడా సక్సెస్ ఫుల్ గా విజయవంతం చేసుకుంటున్నాయి.. అంతేకాకుండా ఇటీవల విడుదలైన ఓ బేబీ చిత్రానికి గాను ఈమెకు ప్రశంసల వర్షం కూడా కురిసింది.


అలాగే ఈమె ఓటీటీ ప్లాట్ ఫామ్ లో కూడా తన సత్తా ఏంటో చాటుకుంటోంది . గత కొద్ది రోజుల నుంచి ప్రసారం అవుతున్న  ఆహా టీవీ లో  శ్యామ్ జూమ్ ప్రోగ్రాం ద్వారా  ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తూ, వారి మనోభావాలను కూడా ప్రేక్షకులకు తెలియజేస్తోంది. ఇక ప్రస్తుతం ఈమె తెలుగులో "శాకుంతలం" అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ ముద్దుగుమ్మ కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా "కాదు వాక్కుల రెండు కాదల్ " అనే సినిమాలో నటిస్తోంది..


మన ఇండియా హెరాల్డ్ తరపున ప్రత్యేకించి సమంతాకు  అలాగే ప్రపంచ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.. మీరు మీ జీవితంలో ఎల్లవేళలా విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము..

మరింత సమాచారం తెలుసుకోండి: