టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్ లో హీరోగా నటిస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం పుష్ప..సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ బ్యూటి రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ – ముత్యం శెట్టి మీడియా కలిసి దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో లారీ డ్రైవర్‌గా అల్లు అర్జున్, గిరిజన యువతిగా రష్మిక మందన్న కనిపించబోతున్నారు.ఆగస్టు 13న ఈ సినిమా భారీ స్థాయిలో తెలుగు తో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కాబోతోంది.

ఇప్పటికే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. ఇంతవరకు ఇలాంటి గెటప్ లో అల్లు అర్జున్ చూడకపోవడం సుకుమార్ గత చిత్రం రంగస్థల సినిమాలో కూడా రాం చరణ్ ని మాస్ క్యారెక్టర్ లోనే చూపించి సక్సస్ అవడం తో పుష్ప సినిమా మీద అంచనాలు బాగా పెరిగాయి. ఇక రష్మిక మందన్న ఈ సినిమాలో ఎలాంటి లుక్ లో కనిపించబోతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న ఫస్ట్ ఛాయిస్ కాదని తాజాగా దర్శకుడు సుకుమార్ వెల్లడించాడు.

ఈ సినిమాలో తెలుగమ్మాయిని హీరోయిన్‌గా తీసుకోవాలని సుకుమార్ ముందు అనుకున్నాడట. కాని డేట్స్ సహా ఇతర సమస్యలు రావడంతో చివరికి పుష్ప కోసం రష్మిక మందన్నని తీసుకున్నట్టు వెల్లడించాడు. ఆ తెలుగమ్మాయి ఎవరోగాని అద్భుతమైన అవకాశాన్ని మిస్ అయినట్టే..అలా మొత్తానికి మన స్టార్ హీరోయిన్ రష్మీకకు అదృష్టవశాత్తు ఈ పాన్ ఇండియన్ మూవీలో హీరోయిన్ గా నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కిందన్నమాట..ఇక ఈ సినిమా తర్వాత బన్నీ.. కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవల్ లోనే తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నారట మేకర్స్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: