ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న సింగర్ సునీత రోజు ఎదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తుంది. ఇప్పటివరకు తన రెండో పెళ్లి విశేషాలను పోస్ట్ చేసి వార్తల్లో నిలిచిన ఆమె తాజాగా మరో ఎమోషనల్ పోస్ట్ పెట్టి అందరిని ఆలోచింపచేసేలా చేసింది.  టాలీవుడ్ లో సింగర్ గా మంచి గుర్తింపు దక్కించుకున్న సునీత ఇటీవలే ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపనేని ని వివాహం చేసుకుంది. చాలా ఏళ్లుగా ఒంటరిగా జీవితం గడిపిన సునీత తన ఒంటరితనానికి స్వస్తి చెప్తూ కొత్త జీవితాన్ని ప్రారంభించింది.. సునీత తీసుకున్న డేరింగ్ స్టెప్ కి ప్రముఖుల దగ్గరినుంచి మంచి ప్రశంశలు దక్కాయి..

సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా సునీత కి మంచి పేరుంది..ఎన్నో పెద్ద పెద్ద సినిమాల్లో హీరోయిన్ లకు తన గాత్రాన్ని దానం చేశారు సునీత.. ఇక సోషల్ మీడియా లో తన కొత్త లైఫ్ గురించి అప్ డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ని కూడా ఉత్సాహపరుస్తుంది.అంతేకాదు తన జీవితంలో జరుగుతున్న కొత్త కొత్త సంగతులను సన్నిహితులతో పాటు అభిమానులతో కూడా పంచుకుంటుంది. తాజాగా తాను తీసుకున్న ఓ స్టైలిష్ ఫొటోను షేర్ చేసిన సునీత.. ఓ భావోద్వేగ పోస్ట్‌ని పెట్టారు.

న‌న్ను జ‌డ్జ్ చేశారు, న‌న్ను ట్రోల్ చేశారు, న‌న్ను ఎద‌గ‌నివ్వ‌కుండా చేశారు, న‌న్ను త‌ప్ప‌ని నిరూపించ‌డానికి ప్ర‌య‌త్నించారు, నన్ను ఇబ్బంది ప‌డేలా చేశారు, న‌న్ను న‌మ్మ‌లేదు, నాకు మ‌ద్ద‌తివ్వలేదు. క‌నీసం నాకు మాట్లాడే అవ‌కాశాన్ని ఇవ్వ‌లేదు. నేను ఓడిపోయిన‌ప్పుడు మీరు న‌వ్వారు, కార‌ణం లేక‌పోయినా న‌న్ను నిందించారు. ఇప్పుడు నాకు హ్యాపీ విమెన్స్ డే చెబుతున్నారు.అయినా నేను దాన్ని స్వీక‌రిస్తా. ఎందుకంటే నువ్వు నా మీద విసిరేసిన రాళ్ల‌తో నా సొంత‌గా ఒక భ‌వ‌నాన్ని క‌ట్టుకున్నారు. నేను న‌వ్వాను, నేను క్ష‌మిస్తాను, ర‌క్షిస్తాను, ప్రేమిస్తాను. నేను అస‌లు వెన‌క్కి తగ్గ‌ను. నేను ఒక మ‌హిళ‌ను. హ్యాపీ విమెన్స్‌డే అని సునీత పోస్ట్ పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: