మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు ప్రముఖ టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతూ చేసిన తొలి సినిమా 'ఉప్పెన'.ఈ సినిమా విడుదలయ్యి మంచి బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. మంచి కలెక్షన్స్ ని రాబడుతూ దూసుకుపోతుంది. ఇప్పటికి విడుదల అయ్యి 24 రోజులు కావస్తున్నా ఈ చిత్రం కలెక్షన్ల జోరు ఏమాత్రం తగ్గడం లేదనే చెప్పాలి.రికార్డు స్థాయిలో వసూలు చేస్తుంది. ఈ సంవత్సరంలో ఇప్పటిదాకా ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టిన సినిమా ఇదే కావడం విశేషం.ఫిబ్రవరి వంటి అన్ సీజన్లో.. ఓ పక్క కొత్త కొత్త సినిమాలు విడుదలవుతున్నా.. ఇంకా ఈ చిత్రం స్ట్రాంగ్ రన్ ను కొనసాగిస్తూ ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచే విషయం. ఇప్పటికే 50కోట్ల షేర్ ను అధిగమించినప్పటికీ ఇంకా ఈ చిత్రం మంచి వసూళ్ళను రాబడుతూనే ఉంది.ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ హీరోయిన్ కృతి శెట్టి.కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేశాడు.



'మైత్రి మూవీ మేకర్స్' మరియు 'సుకుమార్ రైటింగ్స్' బ్యానర్ల పై నవీన్ యర్నేని, వై.రవి శంకర్, సుకుమార్ లు కలిసి నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 12న విడుదలయ్యింది.ఇక ఉప్పెన వసూళ్ల విషయానికి వస్తే..'ఉప్పెన' సినిమాకి 20.5 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు 21కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉండగా.. ఆ టార్గెట్ ను 3 రోజుల్లోనే ఫినిష్ చేసింది 'ఉప్పెన'. ఇక 24 రోజులు పూర్తయ్యేసరికి ఏకంగా 50.64 కోట్ల షేర్ ను రాబట్టి.. ఇప్పటికీ డీసెంట్ రన్ ను కొనసాగిస్తోంది.మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కి కెరీర్ స్టార్టింగ్ లోనే ఉప్పెన సినిమాతో మంచి సాలిడ్ హిట్ లభించింది. డెభ్యు హీరోగా టాలీవుడ్ లో రికార్డులు తన పేరున లిఖించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: