టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ వరుస ప్లాపులతో సతమతమవుతూ చాలా ప్లాపుల తరువాత చేసిన సినిమా "ఎ1 ఎక్స్ ప్రెస్". హాట్ బ్యూటీ లావణ్య త్రిపాఠి సందీప్ కిషన్ కి ఈ సినిమాలో జంటగా నటించింది. ఇక ఈ సినిమాని డెన్నిస్ జీవన్ కానుకొలను డైరెక్ట్ చేశాడు. ఇక ఈ సినిమాని 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ' 'అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్' 'వెంకటాద్రి టాకీస్' బ్యానర్ల పై టి.జి.విశ్వప్రసాద్,అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం వంటి వారు కలిసి నిర్మించారు. హాకీ బాక్డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రానికి తమిళ సంచలన సంగీత దర్శకుడు 'ధృవ' ఫేమ్ హిప్ ఆప్ తమిజా సంగీత దర్శకుడుగా పని చేశాడు. మార్చి 5న విడుదలైన ఈ చిత్రానికి మొదటి షో నుండే హిట్ టాక్ రావడంతో మంచి ఓపెనింగ్స్ ను సాధించింది ఈ చిత్రం.


మొదటిరోజు కంటే 3వ రోజున ఈ చిత్రం బాగా కలెక్ట్ చేసిందని చెప్పాలి.మొత్తానికి ఈ సినిమా సందీప్ కిషన్ కి మంచి ఊరటని ఇచ్చిందనే చెప్పాలి.ఇక సందీప్ 'ఎ1 ఎక్స్ ప్రెస్' సినిమాకి రూ.4.6 కోట్ల బిజినెస్ జరిగింది కాబట్టి.. ఈ సినిమా హిట్ అయ్యి బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 5కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది.3 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 3.08 కోట్ల షేర్ ను రాబట్టింది.అంటే బ్రేక్ ఈవెన్ కు ఇంకా 1.92కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.ఇక ఈ సినిమాకి హిట్ టాక్ రావడంతో 2వ రోజు నుండీ స్క్రీన్లు పెంచుతూ వచ్చారు.ఇక ఖచ్చితంగా ఈ సినిమా అంత వసూలు చేసి బ్రేక్ ఈవెన్ అయ్యేటట్లు ఖాయంలా కనిపిస్తుంది. ఇక మరి చూడాలి ఈ సినిమా ఎంత మాత్రం అంత వసూళ్లు రాబట్టి బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో....


మరింత సమాచారం తెలుసుకోండి: