ఈయనకు ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నారు. అయినా వీళ్ళని సినీ రంగంలోకి రావాలని ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు... వారి పిల్లలకు ఇష్టమైన జీవన శైలిని ఎంచుకునే స్వేచ్ఛను వారికి ఇచ్చారు వెంకటేష్. అయితే ఇన్నాళ్లకు వెంకీ ఇంటి నుండి కెమెరా ముందుకు రాబోతున్నారు ఆయన వారసురాలు. వెంకీ పెద్ద కూతురు అశ్రీత పెళ్లి..వినాయక్ రెడ్డి అనే వ్యక్తితో 2019లో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఇప్పుడు ఈమె కెమెరా ముందుకు రాబోతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. కాకపోతే నటిగా కాదు యూట్యూబర్ గా కనిపించనున్నారు.
తాజాగా 'ఇన్ఫినిటీ ప్లాట్టర్' అనే యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించారు. దీని ద్వారా ఫుడ్ అండ్ ట్రావెల్ కు సంబంధించిన స్పెషల్ విషయాలను ఇందులో షేర్ చేయనున్నారు. అయితే మొత్తానికి వెండి తెరపై కాక పోయినా యూట్యూబ్ లో కనిపించనున్నారు విక్టరీ వెంకీ వారసురాలు ఆశ్రిత. మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోనున్నారో చూడాలి. ఇక పోతే వెంకీ నటిస్తున్న అసురన్ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా దృశ్యం తెలుగు సీక్వెల్ లో కూడా నటించనుండడం విశేషం. ఈ రెండు సినిమాలు మంచి ఫలితాన్ని ఇవ్వాలని ఆశిద్దాము.