ప్రస్తుతం రెండు సినిమాలతో బీజీగా ఉన్న వరుణ్ తన మూడో సినిమాకు ఓకే చెప్పాడని తెలుస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుములతో వరుణ్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఇటీవలే ఆ డైరెక్టర్ చెప్పిన స్టోరీలైన్ విన్న వరుణ్.. నచ్చి వెంటనే కథకు ఓకే చెప్పినట్లు సమాచారం అందుతోంది. వరుణ్ మొదట్లో కథల విషయంలో తడబడ్డ.. ఆ తర్వాత మూస కథలతో వచ్చే సినిమాలను పక్కన పెట్టిన వరుణ్ కొత్తరకం కథలను ఎంచుకోవడం చేయడం మొదలు పెట్టాడు.
దీంతో వరుస విజయాలను వరుణ్ సొంతం చేసుకుంటున్నాడు. ఈ చిత్రం కోసం వరుణ్ ప్రత్యేకంగా బాక్సింగ్ శిక్షణ తీసుకున్నాడు. ఈ సినిమా దాదాపు రూ.35 కోట్లతో భారీగా తెరకెక్కుతోంది. వరుణ్కు జోడిగా ప్రముఖ హిందీ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తోంది. వరుస చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందని ప్రకటించింది.
ఆయితే ఇక్కడ ఓ సమస్య వచ్చింది. అది ఏమంటే.. ప్రభాస్ ప్యాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్ కూడా ఇదే రోజు విడుదలకానుంది. దీంతో ఒకే రోజు రెండు సినిమాలు అంటే ఇటు థియేటర్స్కు కష్టమే.. దీంతో పాటు కలెక్షన్స్ కూడా తగ్గుతాయి. దీంతో వరుణ్ తేజ్ గని ఈ విషయంలో ఓ నిర్ణయానికి వస్తున్నాడని సమాచారం. ఇక్కడ ఇంకో విషయం ఏమంటే.. వరుణ్ తేజ్ ప్రకటించిన కొన్నిరోజులకు రాధేశ్యామ్ టీమ్ తమ సినిమా విడుదల తేది ప్రకటించింది. చూడాలి మరి ఏమౌతుందో.