డార్లింగ్ ప్రభాస్ వరుస పాన్ సినిమాలను ప్లాన్ చేస్తూ ఫుల్ బిజీగా మారారు.. ఒక సినిమా కంప్లీట్ కాకమునుపే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే పనిలో పడ్డాడు ప్రభాస్. ప్రస్తుతం ఈ హీరో ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో‘సలార్’ సినిమాలో నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్ టైన్మెంట్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించబడుదోందని. ఈ మధ్యనే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. వీలైనంత తొందరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగబోతుంది. అయితే పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇటు ప్రేక్షకుల్లనూ, అటు సినీ వర్గాల్లోనూ భారీ అంచనాలే ఏర్పడ్డాయి.
భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ నటీనటులను తీసుకునే పనిలో పడ్డారు మేకర్స్. అయితే ఇందులో మెయిన్ గా డార్లింగ్ ప్రభాస్ సరసన నటించే చిన్నదాని గురించే రోజుకో రూమర్ వస్తోంది. మొదట్లో సలార్ సినిమాలో ప్రభాస్ సరసన దిశా పటానీ నటిస్తోందని  రూమర్లు వచ్చాయి. తర్వాత సాయి పల్లవి నటిస్తుందని కూడా వార్తలు వచ్చాయి. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు మేకర్స్. కాగా ఈ క్రమంలోనే సలార్ కోసం మరో కొత్త కథానాయికను తీసుకుంటున్నారని వినిపిస్తోంది.

ఇప్పటికే పరువురు స్టార్ హీరోయిన్లను కూడా సంప్రదించారట ప్రశాంత్ నీల్. కానీ ప్రభాస్ కోసం మునుపెన్నడూ కనిపించని ఫేస్ ను పరిచయం చేయబోతున్నాడట ప్రశాంత్ నీల్.  అందుకోసమే పరువురు మోడల్స్ ను కూడా పరిశీలిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజమనేది మాత్రం తెలియదు. దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఇంకొన్నాళ్లు వెయిట్ చెయ్యకతప్పదు. అయితే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించేందుకు చాలా మంది టాప్ హీరోయిన్లు సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఈ సువర్ణావకాశం ఎవరి తలుపుతడుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: