సౌత్ లో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న ప్రముఖ హీరోయిన్లలో  నివేదా థామస్ కూడా ఒకరు.తాజాగా  నిన్న రిలీజ్ అయిన 'వకీల్ సాబ్' సినిమాను నివేద థామస్ వీక్షించింది.అది కూడా ఒక  హౌస్ ఫుల్ అయిన ఓ థియేటర్లో నిలబడి మరి సినిమాను చూసింది. ఈ మధ్యనే నివేద థామస్ కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నివేద థామస్ సినిమాను వీక్షించడానికి చేతికి గ్లౌజులు, ముఖానికి మాస్క్ ధరించి థియేటర్ కి వచ్చి నిలబడి మరి  'వకీల్ సాబ్' సినిమాను వీక్షించింది.


ఈ విషయాన్ని స్వయంగా నివేద థామస్ సోషల్  మీడియా ద్వారా ఫోటోలను  అభిమానులతో పంచుకున్నారు.ఫోటోలను షేర్ చేస్తూ ఒక కామెంట్ కూడా పోస్ట్ చేసింది.నేను ఇప్పటిదాకా 'ఈ క్షణం కోసమే చూస్తున్నాను. మాటలు లేవు' అంటూ రాసుకొచ్చింది.'వకీల్ సాబ్' చిత్రంలోని కీలకమైన నటులలో నివేదా థామస్ కూడా ఒకరు. సినిమా మొత్తం నివేద థామస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది . 'వకీల్ సాబ్' సినిమాలో  పల్లవి అనే పక్కింటి అమ్మాయి పాత్రను నివేద పోషించింది .ఈ సినిమాలో నివేద పాత్రకు ఎంతో మంది  ప్రశంసలు కురుపోస్తున్నారు.వకీల్ సాబ్ సినిమాకు పవన్ కళ్యాణ్ ప్రాణం పోస్తే నివేద థామస్ కూడా సినిమాకు ఒక బలం చేకూర్చింది. ముఖ్యంగా కోర్టు సీన్స్ లో వీరిద్దరి నటన అమోఘం అనే చెప్పాలి.

అయితే నివేదా థామస్ కు ఇటీవలే కరోనా పాజిటివ్ అని తెలియడంతో  ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి కూడా హాజరు కాలేదు. అయితే నివేదాను థియేటర్లో చూసిన ప్రేక్షకులు అందరు అయోమయంలో పడ్డారు. ఎందుకంటే నివేదా కరోనా బారిన పడిన విషయం అందరికి తెలిసిందే.మరి ఇలా ఇలా సినిమాకి వచ్చింది.. అసలు కరోనా  నుంచి కోలుకుందా ? లేదా ? అనే విషయంపై క్లారిటీ రాకపోవడంతో అక్కడ ప్రేక్షకులు కన్ఫ్యూషన్ కి గురి అయ్యారు.కరోనా తగ్గబట్టే సినిమాకి వచ్చిందని చాలా మంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. "వకీల్ సాబ్" సినిమాలో  నివేదా థామస్, పవన్ కళ్యాణ్ తో పాటు అంజలిఅనన్యప్రకాష్ రాజ్ ముఖ్యమైన పాత్రల్లో నటించి అందరిని మెప్పించారు.. !

మరింత సమాచారం తెలుసుకోండి: