టాలీవుడ్ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమా ఆఫర్ లతో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఆయన ఖాతాలో పలు సినిమాలు వరుసగా ఉండగా ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న వకీల్ సాబ్ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీ ఇటు ఆంధ్ర అటు తెలంగాణా తో పాటు అన్ని ప్రాంతాల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. వకీల్ సాబ్ రిలీజ్ అయిన అన్ని చోట్ల  ప్రస్తుతం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పవన్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. దీనితో థియేటర్ల దగ్గర పండగ వాతావరణం నెలకొంది.


అయితే ఇక తాజాగా తెలుగు హీరోయిన్‌కు కరోనా సోకింది. వకీల్ సాబ్‌లో కీలకపాత్ర పోషిస్తోన్న నివేదా థామస్ తనకు కరోనా సోకిందని తెలిపింది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియాలో తెలుపుతూ ప్రస్తుతం బాగానే ఉన్నానని.. డాక్టర్స్ సూచనలు పాటిస్తూ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నానని తెలిపింది. అంతేకాదు ఇటీవల తనను కలిసిన వారు టెస్ట్‌లు చేయించుకోవాలనీ తెలిపింది.. నివేదా థామస్.


 ఇదే వకీల్ సాబ్ సినిమా చూడడానికి ఇది సామాన్యులతో పాటు  సెలబ్రిటీలు సైతం ఎదురుచూశారు. అయితే సినిమా విడుదల సందర్భంగా నివేద థామస్ కూడా వకీల్ సాబ్ సినిమా చూడడానికి థియేటర్ కు వెళ్లారు. అయితే అక్కడ ఉన్న జనాన్ని చూస్తూ మాటలు లేవు అంటూ ఒక ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్ పై ఒక అభిమాని ఇలా అన్నాడు. మీకు కరోనా వచ్చి ఇప్పటికి 6 రోజులు క్వారంటీన్ లో ఉన్నారు  కదా. మీకు కరోనా పాజిటివ్ అని వచ్చింది కదా. మరి అలాంటప్పుడు మీరు ఇంత జనం ఉన్న ప్రదేశాలకు మీరు ఎలా వస్తారు అంటూ ఆమెను నిలదీశాడు. అయితే దీనిని చూసిన మిగతా నెటిజన్స్ అందరూ మీకు ఆమె ఎక్కడ ఉంటే మీకు ఎందుకు అంటూ అతనిని తిడుతున్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది

మరింత సమాచారం తెలుసుకోండి: