పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ "అజ్ఞాతవాసి" సినిమా తరువాత దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకొని  నటించిన చిత్రం 'వకీల్‌సాబ్‌'. వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహారించాడు. తమన్ సంగీతం అందించాడు.ఈ సినిమా కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో మిగతా హీరోల అభిమానులు కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. ఇక ఎట్టకేలకు ఏప్రిల్‌ 9న విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ టాక్‌ ని సొంతం చేసుకొని బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్‌ టాక్‌తో.. బాక్సాఫీస్‌కు సరికొత్త రికార్డులను పరిచయం చేసే దిశగా ఈ సినిమా రన్‌ అవుతోంది.ఇక కరోనా సెకండ్‌ వేవ్‌, ఏపీ ప్రభుత్వ కక్ష సాధింపు ఉన్నా.. 'వకీల్‌ సాబ్‌' చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు ఎగబడుతున్నారు.


ఇక ముఖ్యంగా మహిళలు ఈ సినిమా కోసం ముందుకు వస్తుండటం విశేషం.వారు ఊహించినట్లే.. ఈ సినిమా రూపొందడంతో.. ఈ సినిమాకు ఇప్పుడు మహిళల ఆదరణ లభిస్తోంది.ఇక కలెక్షన్స్ కూడా దుమ్ము దులుపుతుంది. ఈ పాండమిక్ టైంలో ఈ రకంగా వసూలు చెయ్యడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.అయితే ఇప్పటిదాకా నాన్ బాహుబలి రికార్డులు క్రియేట్ అయ్యి వున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కి వస్తున్న ప్రేక్షకాధరణ చూస్తుంటే ఖచ్చితంగా నాన్ పవన్ కళ్యాణ్ రికార్డులు క్రియేట్ అవ్వడం ఖాయమట.


మొత్తానికి పవర్ స్టార్ కమ్ బ్యాక్ సినిమా సినిమా పవర్ స్టార్ అభిమానులతో పాటు తెలుగు ఆడియన్స్ ని కూడా కాలర్ ఎగరేసేలా చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: