పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సత్యదేవ్ అనే పవర్ ఫుల్ లాయర్ గా నటించిన తాజా సినిమా వకీల్ సాబ్ రెండు రోజులు ముందు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దిల్ రాజు, బోనికపూర్ కలిసి నిర్మించిన ఈ సినిమాపై అన్ని వర్గాల ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే విడుదల తరువాత సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం అన్ని ఏరియాల్లోనూ భారీ స్థాయి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అనన్య నాగళ్ల, నివేదాథామస్, అంజలి, ముఖేష్ రుషి, సుబ్బరాజు, నరేష్ తదితరులు కీలక పాత్రలు చేయగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.ఎస్.వినోద్ ఫోటోగ్రఫీ అందించారు.

నైజాంలో కూడా ఈ మూవీ మంచి స్పందన రాబడుతుండడంతో పాటు అటు రెండు జంట నగరాల్లో కూడా దుమ్ము రేపుతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే కొద్దిసేపటి క్రితం వకీల్ సాబ్ మూవీ యూనిట్ హైదరాబాదులోని సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ లో సందడి చేసింది. నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు శ్రీరామ్, అంజలి, నివేద థామస్ తదితరులు థియేటర్ కు విచ్చేసి ఆడియన్స్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇక వకీల్ సాబ్ టీం మూవీ థియేటర్ కు వస్తుందని తెలుసుకున్న అభిమానులు ఎంతో సందడి చేసినట్టు తెలుస్తోంది.

తొలిసారిగా పవర్ స్టార్ ను దర్శకత్వం వహించే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందని అలానే ఈ మూవీని ఇంత భారీ సక్సెస్ చేసిన ఆడియన్స్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు వేణు శ్రీరామ్. తమ సినిమాకు ఇంత అద్భుత విజయాన్ని అందించిన ఆడియన్స్ కి ముఖ్యంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు దర్శక నిర్మాత దిల్ రాజు, నాయికలు అంజలి, అనన్య.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: