వేణు శ్రీరామ్ దర్శకత్వంలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా రెండు రోజులు ముందు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయి తొలి రోజు తొలి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం దాదాపుగా అన్ని ఏరియాల్లో కూడా భారీ కలెక్షన్లతో దూసుకెళ్తున్న వకీల్ సాబ్ కోర్టు డ్రామా మూవీ గా పలు కమర్షియల్ హంగులు కలగలిపి తెరకెక్కింది. బోనీ కపూర్ తో కలిసి టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో అంజలి, నివేదాథామస్, అనన్య నాగళ్ళ, నరేష్, సుబ్బరాజు తదితరులు ముఖ్య పాత్రలు చేయగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నందా అనే న్యాయవాది పాత్ర చేశారు.

మూడేళ్ల విరామం తర్వాత పవర్ స్టార్ నుంచి వచ్చిన సినిమా అయినప్పటికీ వకీల్ సాబ్ కు వస్తున్న కలెక్షన్లు చూస్తుంటే ఆయన చరిష్మా, క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అని అంటున్నారు విశ్లేషకులు. ఇక కొద్ది సేపటి క్రితం సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ కి విచ్చేసి ఆడియన్స్ లో జోష్ నింపిన వకీల్ సాబ్ యూనిట్ తమ మూవీ సక్సెస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడింది. ముఖ్యంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల క్రితం తాను టాలీవుడ్ కి డిస్ట్రిబ్యూటర్ గా వచ్చినప్పుడు తొలిప్రేమ మూవీ  హక్కులు కొనుగోలు చేశానని ఆ సినిమాతో తమకు మంచి లాభం వచ్చిందని అక్కడి నుంచి పవర్ స్టార్ తమకు మంచి అనుబంధం ఏర్పడిందని అన్నారు.

అయితే అప్పటి నుండి పవన్ తో ఓ సినిమా నిర్మించాలనేది తన కల అని, అయితే ఇప్పటికి అది వకీల్ సాబ్ ద్వారా తీరడం అలానే మూవీ సూపర్ హిట్ కొట్టడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు దిల్ రాజు. పవర్ స్టార్ కళ్యాణ్ ఒక హీరో కాదని అంతకుమించిన క్రేజ్ కలిగిన వ్యక్తని ఆ విధంగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఆయనను ఓన్ చేసుకున్నారని ఆయనతో సినిమా చేయడం తన అదృష్టమని మాట్లాడుతూ పవన్ పై పొగడ్తలు కురిపించారు రాజు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: