మహేష్ బాబు అంటే ఒక నటుడుగానే కాకుండా బిజినెస్ మాన్ గా కూడా చాలా తెలివిగా వ్యాపారాలని ఎంచుకుంటాడు. ఆయన స్థాపించిన ఏ యమ్ బి సినిమాస్ అనే మల్టీప్లెక్స్ తో ఆయన భారీ లాభాలనే కాకుండా థియేటర్ కి వచ్చే ఆడియన్స్ కి మంచి అనుభూతి ని ఇస్తున్నారు. హైదరాబాద్ లో తక్కువ టికెట్ రేట్ తో ఈ రేంజ్ థియేటర్ అనుభవంలో ఇవ్వడం మహేష్ బాబు విజయం సాధించారు. అయితే ఇప్పుడు ఏ యమ్ బి థియేటర్ కి ఇంటర్నేషనల్ అవార్డ్ కి కూడా ఎంపిక అవ్వడం విశేషం.

ఇనవేషన్ అవార్డ్స్-2021లో లీజర్ అండ్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో ఏఎంబీ సినిమాస్ ఫైనలిస్టుగా ఎంపికవడం విశేషం. ఎవి ఇంటిగ్రేషన్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ వారు ఈ కేటగిరీలో భారతదేశం నుండి  `ఏఎంబీ సినిమాస్` మల్టీప్లెక్స్‌ని మాత్రమే సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.ఈ అవార్డ్ వచ్చినందుకు నమ్రత ఏ యమ్ బి థియేటర్ టీం కి శుభాకాంక్షలు తెలిపింది.ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సర్కారువారిపాట అనే టైటిల్ తో తరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుందని తెలుస్తుంది.

 ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. దుబాయ్ లో కీలక షడ్యూల్ ను పూర్తి  చేసుకుంది. ఇప్పుడు గోవాలో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాతర్వాత మహేష్ ఎవరితో సినిమా చేయబోతున్నాడన్నదని పైన క్లారిటీ రాలేదు.అయితే ప్రస్తుతం వస్తున్న రూమర్స్ ప్రకారం త్రివిక్రమ్ చెప్పిన కథ మహేష్ బాబు కి బాగా నచ్చింది అని టాక్. అయితే ఈ సినిమాని ఆయన త్వరలోనే పట్టాలు ఎక్కించాలి అని చూస్తున్నారట. అలాగే అనిల్ రావిపూడి కూడా మహేష్ కి ఇప్పటికే కథ చెప్పి ఒప్పించారు అని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: