ఇటీవల 'రెడ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎనర్జిటిక్ హీరో రామ్ తన తదుపరి సినిమా విషయంలో తాజాగా అభిమానులకు అప్ డేట్ ఇచ్చాడు. తన తాజా చిత్రాన్ని తమిళ దర్శకుడు లింగుస్వామితో చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. 'పందెం కోడి', 'ఆవారా' వంటి డబ్బింగ్ హిట్ చిత్రాల ద్వారా లింగుస్వామి తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే సుపరిచితుడు.అయితే ఈరోజు ఈ సినిమా నుంచి ఈరోజు ఒక సర్ప్రైజ్ రాబోతుంది అని మూవీ టీం ప్రకటించింది.

అయితే ఆ సర్ప్రైజ్ ఏంటో కాదు ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఇవ్వబోతున్నారు అని మూవీ టీం ప్రకటించబోతున్నారు .ఇక శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు.తమిళంలో మంచి మార్కెట్ వున్న దర్శకుడు లింగుస్వామి తెలుగు హీరోతో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు. అది ఇప్పటికి రామ్ ద్వారా కార్యరూపం దాలుస్తోంది.ఈ సినిమాలో ఒక ప్రధాన పాత్రలో నివేత పుదిరాజ్ నటిస్తుంది. ఆమె పాత్ర హీరో మీద రివెంజ్ తీర్చుకుంటాది అని టాక్ నడుస్తుంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై శ్రీ‌నివాసా చిట్టూరి తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఊర మాస్ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రామ్ స‌ర‌స‌న కృతిశెట్టి హీరోయిన్‌గా న‌టిస్తున్నట్లు అధికారికంగా ప్రక‌టించింది చిత్ర యూనిట్‌.

స్టైలిష్ ఎలిమెంట్స్‌తో అవుట్-అండ్-అవుట్ మాస్ యాక్షన్ ఫిల్మ్‌గా లింగుస్వామి ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో న‌టించే ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వర‌లోనే వెల్లడిస్తామని చిత్ర నిర్మాతలు తెలిపారు. ఈ సినిమా తర్వాత రామ్ త్రివిక్రమ్ తో ఇంకో సినిమా చేస్తున్నారు. ఇలా వరసగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో యంగ్ హీరోస్ లో అందరికన్నా ముందు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: