మెగా మేనల్లుళ్లు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లు ఇద్దరు టాలీవుడ్ హీరోలుగా ఎస్టాబ్లిష్ అయ్యారు.. సాయి ధరమ్ తేజ్ ఇప్పటికే టాలీవుడ్ లో మంచి పేరున్న హీరోగా నిలిచాడు. వైష్ణవ్ తేజ్ కూడా ఈమధ్యే ఉప్పెన సినిమా తో హీరోగా లాంచ్ అయ్యాడు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. ఈరేంజ్ డెబ్యూ మెగా హీరోల్లో ఎవరికీ అవలేదు అని చెప్పాలి.తన యాక్టింగ్ తో అందరిని మెస్మరైజ్ చేశాడు. ప్రేక్షకులే కాదు పెద్ద పెద్ద వారు సైతం వైష్ణవ్ ని పొగిడారు.. మెగా హీరోల్లో తనకంటూ మంచి మార్కెట్ చేసుకున్న హీరోల్లో వైష్ణవ్ తేజ్ ఉంటాడని అన్నారు.

మెగా ఫామిలీ నుంచి హీరోలు ఎక్కవుఅవుతున్నారని బయట ఓ బ్యాచ్ దీన్ని పెద్ద ఇష్యూ చేసే ప్రయత్నం చేస్తుంది.. నిజానికి మెగా ఫామిలీ నుంచి వచ్చిన చిరంజీవి అడుగుజాడల్లో దాదాపు డజను మంది సినీ ఇండస్ట్రీలో హీరోలుగా ఉన్నారు.. వీరిని చూసి ఇతర ఫ్యామిలి నుంచి కూడా హీరోలు దిగుతున్నారు.. ఏ పెద్ద సినిమా చేసిన ఈ నాలుగు ఫ్యామిలీ హీరోలు తప్పా ఎవరు కనిపించరు..ఎప్పుడో విజయ్ దేవరకొండ లాంటి హీరో పుట్టుకొస్తారు.. అంతేకానీ మాక్స్ ఈ నాలుగు ఫ్యామిలీ హీరోలే ఎక్కువగా కనిపిస్తుంటారు.. కానీ టాలెంట్ ఉన్నవారే పైకి వస్తారు.

ఇదిలా ఉంటే తాజాగా ఉప్పెన సినిమా నుంచి మేకింగ్ వీడియో రిలీజ్ అయ్యింది..అందులో వైష్ణవ్ తేజ్ డైరెక్టర్ గా కనిపించదు. కొన్ని సీన్లకు డైరెక్షన్ చేశాడు వైష్ణవ్. మెగాఫోన్ చేతబట్టి యాక్షన్ కట్ అంటూ సందడి చేశాడీ మెగాహీరో. ఇప్పుడు ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మొత్తానికి డైరెక్టర్ అవ్వాలన్న కోరికను మొదటి సినిమా ద్వారానే ఇలా తీర్చేసుకున్నాడని అంటున్నారు.ఇక అయన సినిమాల విషయానికొస్తే రెండో సినిమా షూటింగ్ చివరి దశకు రాగ మూడో సినిమా పూజా కార్యక్రమాలతో ఇటీవలే ప్రారంభం అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: