దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కారణంగానే టాలీవుడ్ లో చాలా మంది హీరోల లైనప్ మారిపోయిందని అంటున్నారు. నిజానికి గత ఏడాది సంక్రాంతికి అల వైకుంఠపురములో సినిమాతో హిట్ కొట్టిన ఆయన ఆ విజయం తర్వాత ఎన్టీఆర్ తో సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెల్సిందే. అయితే ఏమయిందో ఏమో తెలియదు కానీ అనూహ్యంగా ఆ సినిమా ఆగిపోయింది. వెనువెంటనే ఎన్టీఆర్ కొరటాల శివతో ప్రాజెక్ట్ ను కన్ఫర్మ్ చేసుకున్నాడు. అధికారికంగా ప్రకటించాడు. 

అయితే త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా స్థానంలో మహేష్ బాబుతో సినిమా కన్ఫర్మ్ చేసుకున్నాడు. అయితే అల్లు అర్జున్ తో కొరటాల శివ సినిమా కన్ఫర్మ్ అయినా కూడా పుష్ప సినిమా ఆలస్యం అవుతుండడంతో ఆయన సైలెంట్ గా ఎన్టీఆర్ తో సినిమా ఫైనల్ చేసుకున్నాడు. ఈ నేపధ్యంలో కొరటాల శివ, అల్లు అర్జున్ సినిమా వచ్చే సమ్మర్ కు వాయిదా పడింది. దీంతో ఇప్పుడు అల్లు అర్జున్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. 

ఇక ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రానికి తగినంత సమయం తీసుకుని షూటింగ్ చేస్తున్న మహేష్ బాబు, ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కూడా ఉండడంతో తన సినిమా షూట్ ప్రాసెస్ ను పరుగులు పెట్టిస్తున్నాడు. మొత్తం మీద త్రివిక్రమ్ తీసుకున్న ఒక్క నిర్ణయం వల్ల అందరి ప్రాజెక్టుల లైనప్ లు మారిపోయాయని అంటున్నారు. అయితే అసలు ఎందుకు ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా ఆగిపోయింది అనే అంశం మీద మాత్రం క్లారిటీ లేదు. కధ విషయంలో తేడా వచ్చి ఆపారా ? లేక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా ? అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: