జబర్దస్త్ షో చూసే వాళ్లందరికీ యాంకర్ అనసూయ బాగా తెలుసు. ఆమె రంగస్థలం సినిమాలో తన నటనతో యాంకర్ గానే కాకుండా నటిగా కూడా మంచి పేరు తెచ్చుకున్న అనసూయ.అయితే ఆమె సినిమాల్లోనే కాదు సోషల్ మీడియా లో కూడా చాలా యక్టీవ్ గా ఉంటుంది. అయితే ఈ మధ్య ఒక అభిమాని ఆమెని మీరు తాగుతారా అని అడిగిన ప్రశ్న కి అనసూయ అవును తాగుతాను. కొన్ని సార్లు రాత్రి 2 వరకు కూడా తాగుతాను అని చెప్పింది.

అలాగే కొన్ని సందర్భాల్లో తన చర్మం కోసం వైన్ తాగుతా అని చెప్పారు. అయితే ఇలా బహిరంగంగా ఒప్పుకోవడం అనసూయ ధైర్యం చేసింది అనే చెప్పాలి.ఇక ప్రస్తుతం అనసూయ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ తో కూడా అలరిస్తుంది. ఆమె ఈ మద్యనే విడుదలైన చావు కబురు చల్లగా  సినిమాలో ఐటమ్ సాంగ్ కూడా చేసింది. కాకపోతే ఈ పాటకి అంత రెస్పాన్స్ రాలేదు. అయితే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కి ఆమె రెమ్యూనరేషన్ తెలిస్తే ఎవరెనా షాక్ అవ్వాల్సిందే. ఈ సినిమాకి ఆమె యకంగా ఒక్క పాటకి 20 లక్షలు తీసుకుంది అని టాక్. ఒక టాప్ హీరోయిన్ రేంజ్ లో అనసూయ రెమ్యూనరేషన్ తీసుకోడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

ఇక ఆమె నటిస్తున్న కొత్త చిత్రం థాంక్యూ బ్రదర్ సినిమాలో గర్భవతి ప్రియ క్యారెక్టర్ లో అనసూయ అలాగే అభి గా విరాజ్ ఆనంద్ కనిపించబోతున్నారు.ఒక లిఫ్ట్ లో చిక్కుకుపోయిన ఇద్దరు కథ తో వస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతుంది.ఈ సినిమాతో రమేష్‌ రాపర్తి దర్శకునిగా పరిచయమవుతున్నారు.ఈ చిత్రానికి కెమెరా సురేష్‌ రగుతు, సంగీతం గుణ బాల సుబ్రమణియన్‌ పని చేస్తున్నారు. మనసానమః షార్ట్ ఫిల్మ్ లో హీరోగా అందరి దృష్టి ని ఆకర్షించిన అశ్విన్ విరాజ్ ఈ సినిమాతో హీరో గా ఎంట్రీ ఇస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: