ఇండియాస్ జేమ్స్ కామెరూన్ గా శంకర్ కి పేరు ఉంది. కొత్త కొత్త టెక్నాలజీతో గ్రాఫిక్స్ ని వాడి తన సినిమాని ఒక అద్భుతమైన ప్రపంచంలా తెరకెక్కిస్తాడు.ఆయన తీసిన సినిమాల స్థాయి, వసూళ్లు అలా ఉంటాయి మరి. అయితే రికార్డు స్థాయిలో హిట్లు అందుకున్న కాని గత కొంత కాలం నుంచి వరుస ప్లాపులతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆయన కెరీర్‌లో వరుస విజయాలు వస్తున్న సమయంలో 'నన్బన్‌' (తెలుగులో స్నేహితుడు) పేరుతో విడుదల చేశారు.

హిందీలో 'త్రీ ఇడియట్స్‌' ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా బాగా నచ్చడంతో దానిని రీమేక్‌ చేయాలని శంకర్‌ భావించారు. 'నన్బన్‌' పేరుతో విజయ్‌ కీలక పాత్రలో తమిళంలోకి తీసుకొచ్చారు.ఈ సినిమా అంతా బాగానే వున్నా కాని ఆల్రెడీ అప్పటికి త్రీ ఇడియట్స్ యావత్ భారత దేశం మొత్తం ఊపేసింది. అందరూ చూసేశారు కూడా. అందుకే నన్బన్ ప్లాప్ అయింది. ఇక అక్కడి నుంచి వరుస ప్లాపులు ఎదుర్కొంటున్నాడు.

శంకర్‌ ఇప్పుడు మరో రీమేక్‌కి సిద్ధమవ్వడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా 'అపరిచితుడు' రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఒకవేళ శంకర్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటే… కొత్త కథ సిద్ధం చేసుకోవడం పెద్ద విశేషం కాదు. కానీ రీమేక్‌కే మొగ్గుచూపించాడు ఎందుకో మరి. అయితే 'అపరిచితుడు'ను మక్కీకి మక్కీ దించడం లేదనేది ఇక్కడ విషయం. ఇప్పుడున్న పరిస్థితులకి తగ్గట్లుగా మార్పులు చేసి తెరకెక్కిస్తున్నాడట.అయితే గతంలో సౌత్ ఇండియా దర్శకుల్లో నెంబర్ 1 గా దూసుకుపోతున్న శంకర్ కి తెలుగు డైరెక్టర్ రాజమౌళి "బాహుబలి" సిరీస్ తో శంకర్ కే కాకుండా దేశంలోనే నెంబర్ వన్ అనుకుంటున్న డైరెక్టర్లందరికి పెద్ద చెక్ పెట్టాడు. ఇక శంకర్ కూడా రాజమౌళి బీట్ చెయ్యాలనే కసితో రన్విర్ తో చేస్తున్న అపరిచితుడుని ఒక రేంజిలో తెరకెక్కించి తానేంటో మరలా దేశానికి ప్ర్రూవ్ చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఇక చూడాలి శంకర్ భవిష్యత్తులో రాజమౌళిని బీట్ చేస్తాడో లేదో...

మరింత సమాచారం తెలుసుకోండి: