మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం "ఆచార్య" సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.చిరంజీవి సరసన కాజల్‌ నటిస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాటనీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.కరోనా పరిస్థితులు రోజు రోజుకి ఎక్కువవుతుండడంతో 'ఆచార్య' బృందం వేగం పెంచింది. పరిస్థితులు ఇంకా కష్టతారం కాకముందే సినిమా చిత్రీకరణను ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ 'ఆచార్య' పనుల్లో బిజీగా ఉన్నాడట. ఇప్పటికే చిరంజీవి మీద కీలక సన్నివేశాలు తెరకెక్కించిన కొరటాల… ప్రస్తుతం రామ్‌చరణ్‌ సీన్స్‌ పనిలో పడ్డాడట. విరామం లేకుండా వరుసగా చరణ్‌ సీన్స్‌ చాలా వేగంగా చిత్రీకరిస్తున్నారట. 'ఆచార్య'లో చిరంజీవి హీరో కాగా, రామ్‌చరణ్‌ది అతిథి పాత్ర అని ముందు నుంచి వార్తలొచ్చాయి. ఆ తర్వాత రామ్‌చరణ్‌ది కీలక పాత్ర అన్నారు.అలా ఈ సినిమా ఫ్యామిలీ మల్టీ స్టారర్‌గా మారిపోయింది.

తాజాగా తెలుస్తున్న సమాచారం బట్టి ఈ సినిమాలో చరణ్‌ మీద రెండు పాటలు, పెద్ద ఫైట్‌ ఉందట. ఇప్పుడు వాటి చిత్రీకరణలోనే కొరటాల టీమ్‌ చాలా బిజీగా ఉందట. ధర్మస్థలి సెట్‌లో రామ్‌ చరణ్‌ మీద సీన్స్‌ తీస్తున్నారట. దీంతోపాటు అక్కడే ఓ ఫైట్‌ కూడా చిత్రీకరిస్తారట. అది కొరటాల స్టయిల్‌లో ఉండే రెయిన్‌ ఫైట్‌ అని తెలుస్తోంది. 'మిర్చీ'లో కొరటాల రెయిన్‌ ఫైట్‌ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసే ఉంటుంది.ధర్మస్థలిలో కొరటాల బుధవారం ఈ ఫైట్‌ సీన్‌ షూట్‌ చేశారని తెలుస్తోంది. ఈ రోజు కూడా షూట్‌ కొనసాగుతుందట. రెండు రోజుల క్రితం రామ్‌చరణ్‌, పూజా హెగ్డే మీద మీ ఓ పాట చిత్రీకరించారట.ఇలా అన్ని పనులు చెక చెక చెయ్యాలని రామ్ చరణ్ గట్టిగా నిర్ణయించుకొని వేగ వంతం అయ్యాడట...ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి: