మెగా బ్రదర్ నాగ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాగా హీరోగా గుర్తింపు తెచ్చుకోకపోయినా సినిమా ఆర్టిస్ట్ గా నిర్మాతగా బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక వెండితెర మీద చిరంజీవి మెగాస్టార్ గా రాణిస్తే బుల్లి తెర మీద నాగ బాబు రానిస్తున్నారు.జబర్దస్త్ నుంచి బయటకి వచ్చాక కూడా బాగానే ట్రెండ్ అవుతున్నాడు. ఇండస్ట్రీలో నాగ బాబు పెద్ద ఫైర్ బ్రాండ్ అనే చెప్పాలి. తన ఫ్యామిలీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడేస్తే ఏకిపారెస్తాడు.ప్రస్తుతం అదిరింది షో లో జడ్జి గా వ్యవహరిస్తున్నాడు నాగ బాబు.ఇక ఈమధ్య కాలంలో ఇంస్టాగ్రామ్ తో తెగ ట్రెండ్ అవుతున్నాడు నాగ బాబు.ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా నాగబాబు అభిమానులతో ముచ్చటిస్తున్నారు. తాజాగా మరోసారి ఆ ముచ్చట్లలో బాలకృష్ణ, ఆర్జీవీ ప్రస్తావన వచ్చింది.

అందులో  భాగంగా ఓ వ్యక్తి… 'మీ వాట్సాప్‌ డీపీ ఏమిటి?' అని నాగబాబును అడిగారు. దానికి స్పందించిన నాగబాబు… రామ్‌గోపాల్‌వర్మ, బాలకృష్ణ కలసి దిగిన ఓ ఫొటోని షేర్‌ చేశారు.ఆ ఫొటో చూసిన కొంతమంది అభిమానులు ఒక్కసారి షాక్‌ అవ్వగా, ఇంకొందరు నాగబాబు వ్యంగ్యంగా ఈ ఫొటో పెట్టి ఉంటారని అంటున్నారు. దీనికి సమాధానం ఇవ్వాల్సింది నాగబాబునే. ఆయన మళ్లీ ఇన్‌స్టా ముచ్చట్లు పెడితే ఈ విషయం మీద స్పందిస్తారేమో చూడాలి.నాగబాబు మామూలుగా ఈ ఫొటో షేర్‌ చేసుంటే ఒకలా ఉండేది. కానీ బాలకృష్ణ, ఆర్జీవిని తరచుగా విమర్శించే నాగబాబు ఈ పోస్టు చేయడం ఆసక్తి రేకెత్తించింది.


గతంలో కొన్ని సందర్భాల్లో నాగబాబు వీరిద్దరిపై తన విమర్శలు, పంచ్‌లతో విరుచుకుపడ్డారు. ఆ సమయంలో వారి నుండి కూడా సమాధానాలు వచ్చాయి. ఆ తర్వాత పరిస్థితి అంతా సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో ఇలా జరగడం మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి: