అందులో భాగంగా ఓ వ్యక్తి… 'మీ వాట్సాప్ డీపీ ఏమిటి?' అని నాగబాబును అడిగారు. దానికి స్పందించిన నాగబాబు… రామ్గోపాల్వర్మ, బాలకృష్ణ కలసి దిగిన ఓ ఫొటోని షేర్ చేశారు.ఆ ఫొటో చూసిన కొంతమంది అభిమానులు ఒక్కసారి షాక్ అవ్వగా, ఇంకొందరు నాగబాబు వ్యంగ్యంగా ఈ ఫొటో పెట్టి ఉంటారని అంటున్నారు. దీనికి సమాధానం ఇవ్వాల్సింది నాగబాబునే. ఆయన మళ్లీ ఇన్స్టా ముచ్చట్లు పెడితే ఈ విషయం మీద స్పందిస్తారేమో చూడాలి.నాగబాబు మామూలుగా ఈ ఫొటో షేర్ చేసుంటే ఒకలా ఉండేది. కానీ బాలకృష్ణ, ఆర్జీవిని తరచుగా విమర్శించే నాగబాబు ఈ పోస్టు చేయడం ఆసక్తి రేకెత్తించింది.
గతంలో కొన్ని సందర్భాల్లో నాగబాబు వీరిద్దరిపై తన విమర్శలు, పంచ్లతో విరుచుకుపడ్డారు. ఆ సమయంలో వారి నుండి కూడా సమాధానాలు వచ్చాయి. ఆ తర్వాత పరిస్థితి అంతా సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో ఇలా జరగడం మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి..