దర్శకుడు మారుతి తాను తీసే ప్రతి సినిమాలోనూ కొత్తదనం చూపిస్తూ ఉంటాడు. ఒక డిఫరెంట్ లైన్ తో సినిమాను తీసి అందరి ప్రశంసలు పొందుతాడు. ప్రస్తుతం యాక్షన్ హీరో గోపీచంద్ తో 'పక్కా కమర్షియల్'' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.ఈ చిత్రంలో హీరోయిన్ గా రాశి ఖన్నా నటిస్తుంది.మారుతీ దర్శకత్వంలో అంతకముందు వచ్చిన  'ప్రతీరోజూ పండగే' సినిమా మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే.  ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా నే తీసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు గోపి చంద్ కి జోడిగా రాశి ఖన్నాని తీసుకోవడం విశేషం అని చెప్పాలి. ప్రతి రోజు పండగ రోజే సినిమాలో  మారుతి రాసిన టిక్ టాక్ స్టార్ ఏంజిల్ ఆర్నా పాత్రలో రాశీ మంచి కామెడీ పండించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.


అలానే ప్రస్తుతం గోపి చంద్ సినిమాలో కూడా  మరోసారి మారుతి ఆమె కోసం కామెడీ పాత్రనే క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన 'పక్కా కమర్షియల్' ఫస్ట్ లుక్ లో రాశీ ఖన్నాను లాయర్ గెటప్ చూపించి నల్లకోటు ధరింప చేసాడు. అయితే ఈ సినిమాలో  రాశీఖన్నా ఒక సీరియల్ స్టార్ గా కనిపించబోతోందని తెలుస్తుంది. ఈ పాత్ర ద్వారా సీరియల్స్ ట్రెండ్ ని సెటైరికల్ గా మారుతి చూపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన  ఫొటోలో ఆమెను నల్లకోటు ధరించిన లాయర్ గా చూపించారు.


మరి అది సీరియల్ లో భాగమా లేదా గోపీచంద్ తో పాటుగా రాశీ కూడా లాయర్ గా వర్క్ చేస్తుందా అనేది తెలియాలి. ఈ సినిమాలో గోపీచంద్ లాయర్ పాత్రను పోషిస్తున్నాడు. హీరోయిన్లో కూడా కామెడీ యాంగిల్ చూపించే దర్శకుడు మన మారుతీ. మరి ఈసారి కూడా ఏంజిల్ ఆర్న పేరు మారుమోగుతుందో లేదో చూడాలి.  బబ్లీ బ్యూటీకి  'ప్రతిరోజూ పండగే' తరహాలోనే 'పక్కా కమర్షియల్' సినిమా కూడా మంచి హిట్ ఇవ్వాలని కోరుకుందాం..

మరింత సమాచారం తెలుసుకోండి: