మెగా మేనల్లుడు ప్రముఖ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా చేసిన సినిమా "ఉప్పెన" కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.బుచ్చిబాబు సానా డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి వంటి అన్ సీజన్లో విడుదలైనప్పటికీ సూపర్ హిట్ గా నిలిచి రికార్డు స్థాయిలో కలెక్షన్లను నమోదు చేసింది. పోస్ట్ లాక్ డౌన్ తరువాత 50 కోట్ల షేర్ ను రాబట్టిన మొదటి చిత్రంగా ఉప్పెన రికార్డు సృష్టించింది. అంతేకాదు డెబ్యూ హీరోల మూవీస్ లో కూడా ఇదే హైయెస్ట్ కావడం విశేషం.


తన ఫ్యామిలీ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రికార్డుని మళ్ళీ తన ఫ్యామిలీ తరపున బ్రేక్ చెయ్యడం విశేషం అని చెప్పాలి.నిజానికి ఈ చిత్రం ఇంత పెద్ద హిట్ అయ్యేంత గొప్ప కథ ఏమీ సినిమాలో ఉండదు. కలర్ ఫోటో, ప్రేమిస్తే, వంటి ఎన్నో హిట్ సినిమాల స్పూర్తితో రూపొందిన చిత్రమే ఇది. అయితే ఎమోషనల్ కంటెంట్ మరియు పాటలు చిత్రం విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఇక వెండితెర పై అంత హిట్ అయిన ఈ చిత్రం బుల్లితెర పై కూడా అంతే హిట్ అవుతుంది అని మేకర్స్ తో పాటు మెగా అభిమానులు కూడా ఆశిస్తున్నారు.అయితే థియేట్రికల్ పరంగా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన ఉప్పెన కు క్రాక్,జాంబి రెడ్డి వంటి చిత్రాలు కొంత టార్గెట్ ను సెట్ చేసి పెట్టాయి.


రెండు స్టార్ మా లో టెలికాస్ట్ అయినవే..! జాంబీ రెడ్డి 9.7 టి.ఆర్.పి ను క్రాక్ 11 టి.ఆర్.పి ని నమోదు చేశాయి. ఇప్పుడు ఉప్పెన చిత్రం వీటిని మించి 15 వరకూ టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేస్తుందా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. మరి చూడాలి వెండితెర మీద రికార్డులు సృష్టించిన ఈ సినిమా బుల్లి తెరమీద కూడా రికార్డులు సృష్టిస్తుందో లేదో. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.

మరింత సమాచారం తెలుసుకోండి: