మీరా జాస్మిన్ అంటే తెలుగు ఇండస్ట్రీలో తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఎందుకంటే పుట్టింటికి రా చెల్లి సినిమా లో తన క్యారెక్టర్ ను అంతలా ఆకట్టుకుంది. ఈమె జాతీయ ఉత్తమ నటి  కూడా..దక్షిణాది ప్రేక్షకులను తన అందం, అభినయంతో అమితంగా ఆకట్టుకున్న మీరాజాస్మిన్, కొంత కాలం విరామం తో మళ్లీ సిల్వర్ స్క్రీన్  పైకి వస్తోంది. మలయాళీ డైరెక్టర్ సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించే ఒక సినిమాతో ఆమె రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.. ఇక ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ సత్యన్ అంతికాడ్ "తను నిర్మించే చిత్రంలో మీరా జాస్మిన్  రీ ఎంట్రీ ఇస్తోంది" అని ప్రకటించాడు..

ఈ సినిమాలో జయరామ్ , మీరాజాస్మిన్ ప్రధాన  పాత్రధారులుగా కనిపించనున్నారు. ఈ సంవత్సరం జులై మధ్యలో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లనుంది. ఇక స్పెషల్ అప్పియరెన్స్ ను  పక్కన పెడితే ఒక ప్రధాన పాత్రలో పోషించడం, అందులోనూ ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి సినీ ఇండస్ట్రీకి రావడం ఇదే మొదటిసారి.. టాలీవుడ్లో చివరిసారిగా 2013లో వచ్చిన థ్రిల్లర్  మోక్ష సినిమాలో నటించింది. ఆ తర్వాత తన మాతృభాష అయిన మలయాళ సినీ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలలో నటించింది. 2014లో ఆమె దుబాయిలో ఇంజనీర్ గా పనిచేస్తున్న అనిల్ జాన్ టైటస్ ను పెళ్లాడింది. ఇక మలయాళంలో కూడా 2016 పదు కల్పన కల్ సినిమాలో చివరి సారి గా నటించింది..


అంతేకాకుండా 2003లో ఈమె నటించిన మలయాళం సినిమా పాదమ్ ఒన్ను  ఒరు విలాపమ్ చిత్రానికి గాను, ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర అవార్డుతో పాటు నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు సత్యన్ అంతికాడ్ డైరెక్షన్లో చేస్తున్న సినిమా తర్వాత ఆమె నటనను కొనసాగిస్తుందా లేదా అనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు.. అయితే ఈమె తిరిగి రీఎంట్రీ ఇస్తోంది అనే వార్త వినగానే అభిమానులు ఎక్కడలేని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. ఏది ఏమైనా తెలుగు దర్శకులు కూడా మీరాజాస్మిన్ దృష్టిలో పెట్టుకోవాలని మనం కూడా ఆశిద్దాం..


మరింత సమాచారం తెలుసుకోండి: