మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. చ‌ర‌ణ్ ఇప్ప‌టికే మెగాస్టార్ హీరోగా న‌టిస్తున్న ఆచార్య సినిమాలో త‌న షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకున్నారు. అంతే కాకుండా రాజ‌మౌలి ద‌ర్శ‌త్వంలో వ‌స్తున్న‌ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. ఈ సినిమాతో చ‌ర‌ణ్ ప్యాన్ ఇండియా స్టార్ గా ప‌రిచ‌యం కాబోతున్నారు. ఇప్ప‌టికే రామ్ చ‌ర‌ణ్ న‌టించిన మ‌గ‌ధీర సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు రాగా ఆర్ఆర్ఆర్ లో చ‌ర‌ణ్ లుక్ చూస్తుంటే దేశ వ్యాప్తంగా మ‌రింత క్రేజ్ రాబోతుందని అర్థ‌మ‌వుతోంది. అయితే ఈ సినిమా పూర్తి చేసుకున్న వెంట‌నే చ‌ర‌ణ్ మ‌రో ప్యాన్ ఇండియా ప్రాజ‌క్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఈ చిత్రాన్ని శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జులైలో సెట్స్ పైకి తీసుకువెళ‌తామ‌ని నిర్మాత దిల్ రాజు ఇటీవ‌లే ఓ ఇంట‌ర్యూలో వెల్ల‌డించారు.

ఇదిలా ఉండ‌గా ఈ క్రేజీ ప్రాజ‌క్టులో  హీరోయిన్ గా ఎవ‌రు న‌టిస్తార‌నేది ముందు నుండి ఆస‌క్తిగా మారింది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాలో న‌టించేందుకు ద‌ర్శ‌కుడు శంక‌ర్ ర‌ష్మిక ను సంప్రందించార‌ట‌. అంతే కాకుండా సినిమా క‌థ‌ను ర‌ష్మిక‌కు వివ‌రించ‌గా ‌ ఇంప్రెస్ అయింద‌ట‌. దాంతో వెంట‌నే ఈ సినిమాలో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిందట‌. అయితే ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే మాత్రం అఫీషియ‌ల్ అనౌన్స్మెంట్ వ‌చ్చే వ‌ర‌కు ఆగాల్సిందే. ఇదిలా ఉండ‌గా ర‌ష్మిక ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ ప్రాజ‌క్టుల‌తో ఫుల్ బిజీగా ఉంది. అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తున్న పుష్ప సినిమాలో ర‌ష్మిక హీరోయిన్ గా న‌టిస్తోంది. అంతే కాకుండా బాలీవుడ్ లో గుడ్ బాయ్ అనే సినిమాలోనూ న‌టింస్తోంది. ఈ సినిమాలో అమితా బ‌చ్చ‌న్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవ‌కాశాన్ని ద‌క్కించుకుంది. మ‌రో బాలీవుడ్  సినిమా మిష‌న్ మ‌జ్నులోనూ ర‌ష్మిక హీరోయిన్ గా న‌టిస్తోంది. ఇక ఈ నేష‌న‌ల్ క్ర‌ష్ రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న ఏ మేర‌కు అల‌రిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: