‘కంచె’ మూవీతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైంది ప్రగ్యా జైశ్వాల్. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్గా నటించినప్పటికి అనుకున్న స్థాయిలో ఆమెకు గుర్తింపు రాలేదు. ఈ క్రమంలో ఆమెకు హీరో బాలకృష్ణ తాజా చిత్రం ‘బీబీ3’లో నటించే అవకాశం వచ్చింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రగ్యా కీలక పాత్రలో కనిపించనుంది.అయితే ఈ బ్యూటీ ఇప్పుడు మళ్లీ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం తెలుగులో బాలకృష్ణ, బోయపాటి చిత్రంలో నటిస్తోన్న ఈ బ్యూటీ.. మోహన్ బాబు నటిస్తోన్న సన్ ఆఫ్ ఇండియాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక హిందీలో సల్మాన్ ఖాన్ సరసన ఆంటీమ్లో నటించే అవకాశాన్ని ప్రగ్యా సొంతం చేసుకున్నట్లు సమాచారం. చూస్తుంటే ఈ బ్యూటీ మళ్లీ బిజీగా మారబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాతో పాటు బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమాలోనూ హీరోయిన్గా చేస్తున్నారు ప్రగ్యా. రెండు పెద్ద ప్రాజెక్ట్స్తో ఈ ఏడాదిని సూపర్గా ఆరంభించారు ప్రగ్యా జైస్వాల్.హిందీ సూపర్స్టార్ సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్గా నటించే అవకాశాన్ని పొందారు ప్రగ్యా. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ చిత్రం ‘అంతిమ్’. ఇందులో సల్మాన్ బావమరిది ఆయుష్ శర్మ విలన్గా నటిస్తున్నారు. సల్మాన్కి జోడీగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. ఆల్రెడీ చిత్రీకరణ కూడా ప్రారంభించారామె .అయితే తాజాగా ప్రగ్యా జైస్వాల్ ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. తన అందనంత ఆరబోస్తూ నీటిలో తన ఇచ్చిన స్టైల్ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.