దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో కలిసి ఆర్ఆర్ఆర్ అనే భారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దానయ్య అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నారు. పేట్రియాటిక్ డ్రామా మూవీగా పలు కమర్షియల్, యాక్షన్, ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సముద్రఖని, అజయ్ దేవగన్, శ్రియ శరణ్ తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా కీరవాణి దీనికి సంగీతాన్ని అలానే విజయేంద్రప్రసాద్ కథని అందిస్తున్నారు.

మూవీ ఈ ఏడాది అక్టోబర్ 13న విడుదల కానుంది. అయితే దీని తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన తదుపరి సినిమాని రాజమౌళి తెరకెక్కించనున్నారు శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్ నారాయణ నిర్మాతగా ఎంతో భారీ వ్యయంతో ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రూపొందనున్న ఈ మూవీకి సంబంధించి ఇటీవల స్వయంగా రాజమౌళి ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ సినిమా ఎలా ఉంటుంది, ఏ స్థాయిలో రూపొందబోతోంది అనే ఉత్సాహం తెలుగు ఆడియన్స్ తో పాటు మహేష్ బాబు ఫ్యాన్స్ లో కూడా విపరీతంగా పెరిగింది. అలానే కొద్దిరోజులుగా వారిద్దరి కాంబో మూవీ పై పలు రకాల కథనాలు కూడా మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నాయి.

నిజానికి ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విజయేంద్రప్రసాద్ ఒక మీడియా ఛానల్ వారితో మాట్లాడుతూ ఈ మూవీ కథ సౌత్ ఆఫ్రికా అడవుల నేపథ్యంలో అడ్వెంచరస్ డ్రామాగా తెరకెక్కనుందని అన్నారు. అయితే పక్కాగా సినిమా అదే విధంగా రూపొందుతుందా లేదా మరేదైనా కథ అనుకున్నారా అనేది తేలాల్సి ఉందని ప్రస్తుతం రాజమౌళి తన దృష్టిని పూర్తిగా ఆర్ఆర్ఆర్ పైనే పెట్టారని దాని రిలీజ్ అనంతరం కొంత విరామం తీసుకున్న తర్వాత స్వయంగా రాజమౌళినే మహేష్ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తారని అప్పటి వరకు దీనిపై వచ్చే పుకార్ల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: