ఇంటర్నెట్ డెస్క్: క్రాక్ సినిమాతో చాలా ఏళ్ల తరువాత మాస్ మహారాజ రవితేజ మళ్లీ హిట్ బాట పట్టారు. దాదాపు 5-6 ప్లాపుల తరువాత మళ్లీ హిట్ కొట్టాడు. రాజా ది గ్రేట్‌ తర్వాత క్రాక్‌ సినిమా తో మళ్లీ సక్సెస్ ను రవితేజ దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే వరుస సినిమాలు ఒప్పుకుంటూ మళ్లీ హిట్ ట్రాక్ కొనసాగించాలని అనుకుంటున్నాడు. అయితే దీనికోసం రవితేజ చేస్తున్న ఓ పని అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. తమ హీరో తిరిగి మునుపటి తప్పే చేస్తున్నాడే అంటూ భయపడిపోతున్నారు. అదే జరిగితే మళ్లీ ప్లాపులు తప్పవని ఆవేదన చెందుతున్నారు. ఇంతకీ రవితేజ చేస్తున్న ఆ తప్పేంటో తెలుసుకుందాం.

మాస్ మహారాజా రవితేజ ఈతరం హీరోల్లో అత్యధిక సినిమాల్లో నటించిన ఘనత దక్కించుకున్నాడు. తెలుగు యంగ్‌ స్టార్‌ హీరోలకు పోటీగా రవితేజ ఇప్పటికి కూడా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే రవితేజ వరుస ప్లాపులతో సతమతం కావడానికి అసలు కారణం కథ విషయంలో లైట్ తీసుకోవడమేనని టాక్. రవితేజ గతంలో కథ విషయంలో పెద్దగా పట్టించుకునే వాడు కాదు. దర్శకుడి గురించి కూడా ఆలోచించేవాడు కాదు. ఏ కథ అయినా, ఏ డైరెక్టర్ అయినా వరుస సినిమాలకు కమిట్‌ అయ్యేవాడు. ఇప్పుడు కూడా అదే తరహాలో డైరెక్టర్, కథతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు.

గడిచిన 2-3ఏళ్లుగా రవితేజ సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. కాని క్రాక్ హిట్ తరువాత.. మాత్రం కథ, దర్శకుడి విషయంలో మళ్లీ పట్టింపు లేనట్లుగా ఆయన ప్రవర్తిస్తున్నాడేమో అంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

రవితేజ ఒకటి రెండు నెలల్లోనే ఎలాంటి గ్యాప్‌ లేకుండా సినిమాలు చేసేందుకు సిద్దం అవుతున్నాడు. తాజాగా రవితేజ హీరోగా శరత్‌ అనే దర్శకుడితో సినిమా ప్రారంభం అయ్యింది. ఆ సినిమా షూటింగ్‌ కూడా ఇటీవల మొదలయింది. ఇలాంటి సమయంలో రవితేజ నటిస్తున్న ఈ సినిమాను కేవలం నెల రోజుల గ్యాప్‌ లోనే పూర్తి చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాడట. కాని రవితేజ మాత్రం త్వరగా పూర్తి చేసేయాలని అనుకున్నాడట. ‘నెల రోజుల్లో సినిమా ఎలా పూర్తి చేస్తావ్ బాసూ’ అంటూ అభిమానులే షాకవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: