వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలకృష్ణ గారికి  'సింహా' వంటి బ్లాక్ బస్టర్‌తో మంచి సక్సెస్ అందించాడు బోయపాటి శ్రీను. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన 'లెజెండ్' మూవీ అంతకు మించిన సక్సెస్ సాధించింది.'ఉగాది' పండగ సందర్భంగా ఈ సినిమాకి అఖండ పేరుని నిర్ణయించి ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. సాక్షాత్తు పరమశివుడు కొలువైన ప్రదేశంలో దుష్ట శిక్షణ చేసే అపర కాలభైరవుడిగా ఈ టీజర్ లో బాలకృష్ణ కనిపించారు. ఆయన లుక్ మంచి మార్కులు కొట్టేసింది. హరహర మహాదేవ అంటూ దుర్మార్గులపై ఆయన విరుచుకుపడిన తీరుకి మంచి రెస్పాన్స్ వస్తోంది.

సినిమా టీజర్ కి ఇప్పటికే 20 మిలియన్లకి పైగా వ్యూస్ ను సాధించి ట్రెండ్ అవుతోంది. సినిమాఫై అంచనాలు పెంచే దిశగానే ఈ టీజర్ దూసుకుపోతోంది.అయితే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటిటి హాట్ స్టార్ భారీ రేట్ కి కొన్నారు అని టాక్.అలాగే ఈ సినిమా సాటిలైట్ రైట్స్ ని స్టార్ మా కొన్నారు. ఇక బోయపాటి శీను ఇంతకుముందు తీసిన సినిమాలు కూడా సరిగ్గా ఆడలేదు. బాలకృష్ణ గారికి 100 వ సినిమా తర్వాత ఇప్పటికి ఒక్క సరేనా హిట్ సినిమా పడలేదు దాంతో ఆయన ఫాన్స్ కూడా నిరాశలో ఉన్నారు.ఈ అఖండ టీజర్ తో బాలయ్య ఫాన్స్ లో కోలాహలం మొదలయ్యింది.

ఇక ఈ సినిమాకి సంగీతం థమన్ అందిస్తున్నారు. ఈ సినిమా తో అయిన బాలకృష్ణ గారు , బోయపాటి శ్రీను గారు రీఎంట్రీ ఇస్తారో లేదో వేచి చూడాలి. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో బాలయ్య బోయపాటి హ్యాట్రిక్ హిట్ కొట్టాలని అనుకుంటున్నారట. దాదాపుగా షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమా ఇప్పటికే ఆంధ్ర తెలంగాణ లో బిజినెస్ కూడా పూర్తి చేసుకుంది అని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: