తెలుగు సినిమాలో హిట్లు తగ్గిపోతున్నాయి. ఫ్లాప్స్ డిజాస్టర్లు పెరిగిపోతున్నాయి. దానికి కారణం పోటీతత్వం ఎక్కువగా ఉండడమే. మరో వైపు చూస్తే సబ్జెక్టులు కూడా ఒకే రకం తీసుకుని అటూ ఇటూ తిప్పుతూండడం వల్ల కూడా హిట్లు రావడంలేదు అంటున్నారు.

అయితే టాలీవుడ్ లో ఇంటలిజెంట్ డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు. వారిలో మారుతి ఒకరు. ఆయన మొదట్లో కేవలం యూత్ ఆడియన్స్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీశారు. ఆ తరువాత ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీస్ ని కూడా తీశారు.  అవి సూపర్ హిట్ అయ్యాయి. దాంతో ఆ జానర్ లోనే మారుతి సినిమాలు తీయగలడన్న ముద్ర పడిపోయింది. 2019 చివరలో మారుతి తీసిన ప్రతి రోజు ఒక పండుగ అన్న మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తరువాత మారుతి టాప్ డైరెక్టర్ల రేసులోకి వస్తాడు అని అంతా అనుకున్నారు. కానీ మారుతి మాత్రం ఇంకా తనదైన శైలిలో సినిమాల కొరకు  కధలతోనే కసరత్తు చేస్తున్నారు.

ఇపుడు ఒక క్లారిటీకి వచ్చిన మారుతి పక్కా కమర్షియల్ మూవీ తీయడానికి రెడీ అవుతున్నాడుట. ఈ మూవీకి హీరో గోపీచంద్ ని సెలెక్ట్ చేశారు అని తెలుస్తోంది. అదే విధంగా ఈ మూవీలో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కంప్లీట్ కమర్షియల్ ఫార్మెట్ లో తీయడం ద్వారా తన సత్తా చాటాలని చూస్తున్నారు. ఇక కసి మీద ఉన్న మారుతి డైరెక్టర్ కావడంతో గోపీచంద్ కూడా ఉత్సాహంగా నటించేందుకు సిద్ధం అవుతున్నారు. సరైన హిట్ లేని గోపీ ఈ మూవీతో అదిరిపోయే హిట్ ని అందుకోవాలని చూస్తున్నారుట. చూడాలి మరి మారుతి గోపీ చంద్ మూవీ ఎలా ఉంటుందో. ఇక ఈ సినిమాతో రాశీ ఖన్నా తన లక్ ని మరో సారి పరీక్షించుకోవడానికి రెడీ అవుతోందిట. ఈ అమ్మడికి కూడా అర్జంట్ గా హిట్ కావాల్సి ఉంది మరి.






మరింత సమాచారం తెలుసుకోండి: