తెలుగులో టాప్ హీరో గా ఒక రేంజ్ క్రేజ్ ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు 2020లో వచ్చిన సరిలేరు నికెవ్వరు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో  మంచి జోష్ మీద తన కొత్త సినిమా సర్కారు వారి పాట లో నటిస్తున్నారు. ఈ సినిమాని గీత గోవిందం లాంటి సూపర్ హిట్ తీసిన పరుశురాం దర్శకత్వం వహిస్తున్నారు. ఇక కీర్తి సురేష్ ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాను వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, మహేష్ బాబు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్ దుబాయ్‌లో ప్రారంభమైంది. ఫస్ట్ షెడ్యూల్లో మహేష్ బాబు, కీర్తి సురేష్ లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. దుబాయ్ షెడ్యూల్ ముగిసిన త‌ర్వాత హైద‌రాబాద్‌లో మిగ‌తా మూవీ చిత్రీక‌ర‌ణ జ‌ర‌గ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సోదరి పాత్రకి మంచి ప్రాముఖ్యత ఉందంట. అయితే ఈ పాత్ర కోసం ప్రముఖ బాలీవుడ్ నటి విద్య బాలన్ ని అడిగారట. అయితే ఆమె ఇంకా తన అభిప్రాయం చెప్పలేదు అని టాక్.

ఈ వార్త మాత్రం నిజం అయితే ఈ సినిమాకి ఓ రేంజ్ లో క్రేజ్ వస్తుంది.అయితే ఈ సంవత్సరం మహేష్ బాబు ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు కాబట్టి ఈ సినిమా నుంచి ఒక టీజర్ విడుదల చేస్తే అభిమానులు ఆనందిస్తారని మూవీ టీం భావిస్తుంది.ఇక 2020 సంక్రాంతి లాగానే 2022 సంక్రాంతికి మహేష్ బాబు మళ్ళీ సూపర్ హిట్ కొడతాడేమో చూడాలి. ఈ సినిమా మీద అంచనాలు కూడా బాగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: