దేశముదురు సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన హన్సిక , ఆ సినిమా తర్వాత వరసగా తెలుగులో టాప్ హీరోస్ తో నటిస్తూ వచ్చింది. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్నప్పుడే ఆమె కోలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ అక్కడ జూనియర్ కుష్బూ గా పేరు తెచ్చుకుంది. అయితే ఈ మధ్య హన్సిక చాలా బరువు తగ్గింది.అయితే ఈ మద్య సినిమాలు తక్కువగా చేస్తున్న సోషల్ మీడియా లో బాగానే ఆక్టివ్ గా ఉంటుంది.  ఇక హీరోయిన్‌గా హన్సిక 50వ సినిమా మైలు రాయిని అందుకున్నారు. ఆమె 50వ సినిమా ఓ క్రేజీ లేడీ ఓరియంటెడ్‌ కథ . ‘మహా’ టైటిల్‌తో ఈ సినిమాకు యుఆర్‌ జమీల్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే పూర్తి చేశారు.

ఇప్పుడు ఆమె తెలుగులో మరో ప్రయోగానికి హన్సిక తెరలేపింది. ఇండియన్ సినిమాల్లోనే ఇప్పటి వరకు రానటువంటి కొత్త తరహాలో సినిమా చేయబోతుంది.`105మినిట్స్` పేరుతో ఒకే క్యారెక్టర్‌తో ఎడిటింగ్‌ లేకుండా, ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే కథ, కథనంతో సింగిల్‌ షాట్‌లో సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కంటిన్యూగా ఈ సినిమాని ఎలాంటి బ్రేకులు లేకుండా చిత్రీకరించబోతున్నారు.రీల్‌ టైమే, రియల్‌ టైమ్‌గా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. ఇండియన్‌ స్క్రీన్స్ పై ఇది మొట్టమొదటిసారి చేస్తున్న ప్రయోగం. ఇది హన్సికపై చేయబోతుండటం విశేషం.రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మాణంలో హన్సిక మోట్వాని ముఖ్య పాత్రలో తెరకెక్కుతుంది.

మునుపెన్నడూ లేని విధంగా ఈ చిత్రంలో హన్సిక మోట్వాని ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో కనపడబోతోందని చిత్ర దర్శకుడు రాజు దుస్సా వివరించారు.ఈ చిత్రం తన కెరీర్ లోనే ఒక మైలురాయి గా నిలిచి పోతుంది అని చిత్ర కథానాయిక హన్సిక మోట్వాని తెలిపారు. సినిమాటోగ్రాఫర్ దుర్గా కిషోర్ మాట్లాడుతూ ఈ సినిమా మేకింగ్ తనకు ఒక ఛాలెంజ్ అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: