వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తరచూ ఏదో ఒక న్యూస్ తో హాట్ టాపిక్ గా ఉంటారన్నది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందులోనూ ఈ కరోనా టైంలో ఏదో రకంగా అందరి దృష్టిని ఆకర్షిస్తూ దూసుకుపోయే డిఫరెంట్ డైరెక్టర్ గా పేరు ఈయనకు ఉంది. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న క్రమంలో ఈయనకు సంబంధించిన మరో న్యూస్ ఒకటి సెన్సేషనల్ గా మారింది. ప్రస్తుతం కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో వాయిదా పడుతున్నాయి. ఈ క్రమంలో నాగ చైతన్య, సాయి పల్లవి సినిమా లవ్ స్టోరీ, నాని.. టక్ జగదీష్ చిత్రాలు అనుకున్న డేట్స్ కి విడుదల చేయబోవడం లేదని మేకర్స్ ప్రకటించారు.

దాంతో వకీల్ సాబ్ సినిమా తర్వాత... థియేటర్లలో సందడి చేసే మరో చిత్రం లేకపోవడంతో, ఇదే మంచి సమయం అనుకున్నాడో ఏమో కానీ తన సినిమాని థియేటర్లో విడుదల చేసి అందర్నీ ఆశ్చర్య పరిచాడు ఆర్జీవి. ఆరేళ్ల క్రితం 'పట్ట పగలు' అనే సినిమా చేసిన ఆర్జీవీ... ఇప్పుడు అదే సినిమాకి పేరు మార్చి... ఆర్జీవి దెయ్యం అనే టైటిల్ తో (ఏప్రిల్ 16) శుక్రవారం నాడు థియేటర్స్ లో రిలీజ్ చేశాడు. కాక పోతే ఇక్కడ వచ్చిన చిక్కల్లా... ఇలాంటి ఒక సినిమా విడుదల అయిందని కూడా పెద్దగా ప్రేక్షకులకు ఎవరికీ తెలియలేదు. తెలిసిన వారు సైతం రిస్క్ చేసేంత సినిమా కాదు లే అన్నట్టుగా... ఈ చిత్రం కోసం థియేటర్స్ కి రావడం లేదు.

చూసిన కొద్ది మంది ప్రేక్షకులు కూడా ఈ సినిమాలో కొత్తదనం లేదంటూ మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారట. దీంతో ఈ సినిమాకి పెద్దగా బుకింగ్స్ లేవు. మరో వైపు ఏఆర్ రెహమాన్ స్టోరీ అందించి.. నిర్మాతగా మారి నిర్మించిన '99 సాంగ్స్' చిత్రం కూడా రిలీజ్ అయినప్పటికీ... ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ప్రముఖ్ హీరో రాజశేఖర్ నటించిన దెయ్యం సినిమా చేసి తప్పు చేశాడా అనే సందిగ్ధంలో పడ్డాడేమో అనిపిస్తుంది. మరి ఇక ముందైనా మంచి సినిమాలను ఎంచుకుంటూ మరి కొంతకాలం సినిమా పరిశ్రమలో కొనసాగుతాడా...? చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: