విక్టరీ వెంకటేష్ కుర్ర హీరోలకు సైతం పోటీ ఇస్తున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన రెండు రీమేక్ సినిమాలు, ఒక సీక్వెల్ సినిమా చేస్తున్నారు. తమిళ సూపర్ హిట్ అసురన్ రీమేక్ గా నారప్ప, ఎఫ్ 2 సినిమా సీక్వెల్ గా ఎఫ్ 3 సినిమా, మళయాళ దృశ్యం 2 సినిమా రీమేక్ కూడా ఒక నెల క్రితం షూటింగ్ మొదలుపెట్టి మొన్ననే పూర్తి చేశాడు. అసురన్ రీమేక్ ‏గా తెరకెక్కిన  నారప్ప సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద పై సురేష్ బాబు నిర్మిస్తుండగా.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. 

ఈ సినిమాను మే 14 న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యోచిస్తోంది యూనిట్. ఈ సినిమాలో వెంకటేష్ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం వెంకీ పూర్తిగా తన లుక్ ను మార్చాడు. ఈ సినిమాతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 సినిమా షూటింగ్ కూడా చేస్తున్నారు. ఇందులో వెంకటేష్ తో పాటు మెగా హీరో వరుణ్ తేజ్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సంగతి పక్కన పెడితే మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన దృశ్యం 2 సినిమా రీమేక్ షూటింగ్ మొన్నీమధ్య పూర్తయింది.

మలయాళం దృశ్యం 2 ఓటీటీలో విడుదలై సూపర్ హిట్ గా నిలవగా అది నచ్చి కొన్ని రోజులకే తెలుగులో షూటింగ్ ప్రారంభించారు. దృశ్యం 1 సినిమాలో నటించిన నటీనటులు ఈ సినిమాలో కూడా నటిస్తున్నారు. అయితే అసలు విషయం ఏమిటంటే ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ ఓటీటీలో నేరుగా రిలీజ్ అయింది. అందుతున్న సమాచారం మేరకు ఈ తెలుగు సినిమాని కూడా ఓటీటీలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ తో పాటు, ఏపీలో టికెట్ల అంశంతో ఎందుకొచ్చిన తలనొప్పి అని భావించి దాన్ని కూడా ఓటీటీలో రిలీజ్ చేయాలని చూస్తున్నట్టు సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: